epaper
Sunday, March 1, 2026
epaper

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం

భారీ జరిమానాను సవాలు చేస్తూ ద‌ళ‌ప‌తి రిట్ పిటిషన్

జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పిన ధ‌ర్మాస‌నం

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: ప్రముఖ సినీ నటుడు, ‘తమిళగ వెట్రి కజగం’ పార్టీ అధినేత దళపతి విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్నుశాఖ తనకు విధించిన రూ.1.50 కోట్ల భారీ జరిమానాను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. ఐటీశాఖ జారీచేసిన పెనాల్టీ ఉత్తర్వులు చట్టబద్ధంగానే ఉన్నాయని, నిర్ణీత గడువులోపే ఆ నోటీసులు జారీ అయ్యాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. దీంతో విజయ్ ఇప్పుడు ఆ జరిమానా చెల్లించడం లేదా పై కోర్టులకు వెళ్లడం అనివార్యమైంది.

అసలేం జరిగింది?

ఈ కేసు మూలాలు 2015 నాటివి. 2015 సెప్టెంబర్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విజయ్ నివాసంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో విజయ్ నటించిన ‘పులి’ సినిమాకు సంబంధించి కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సినిమా ద్వారా విజయ్ సుమారు రూ.15 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందారని, కానీ ఆ మొత్తాన్ని తన ఆదాయపు పన్ను రిటర్నుల్లో చూపించలేదని ఐటీ శాఖ ఆరోపించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ ఆదాయాన్ని దాచిపెట్టారన్నది ప్రధాన అభియోగం.

రూ.1.50 కోట్ల పెనాల్టీ

సోదాల్లో లభించిన ఆధారాల మేరకు ఐటీ శాఖ చర్యలకు ఉపక్రమించింది. లెక్కల్లో చూపని ఆ రూ.15 కోట్ల ఆదాయానికి సంబంధించి, 2022 జూన్ 30న ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం విజయ్ రూ.1.50 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ విజయ్ 2022లోనే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి బెంచ్, 2022 ఆగస్టు 16న పెనాల్టీ చెల్లింపుపై మధ్యంతర స్టే విధించింది.

వాదనలు ఏంటి?

విజయ్, ఐటీ శాఖ తరఫున హోరాహోరీ వాదనలు జరిగాయి. “ఐటీ శాఖ జారీ చేసిన పెనాల్టీ ఆర్డర్ కాలం చెల్లింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 275 ప్రకారం, 2019 జూన్ 30 లోపే ఈ ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ మూడేళ్లు ఆలస్యంగా ఇచ్చారు కాబట్టి దీన్ని రద్దు చేయాలి” అని విజయ్ తరఫున వాదనలు వినిపించారు. చట్టంలోని సెక్షన్ 263 ప్రకారం, షోకాజ్ నోటీసు జారీ చేయడం, పెనాల్టీ విధించడం అన్నీ నిబంధనల ప్రకారమే, నిర్ణీత గడువులోపే జరిగాయి. ఇందులో ఎలాంటి ఉల్లంఘన లేదు” అని ఐటీ శాఖ వాదనలు వినిపించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం అవ్వండి!

తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం అవ్వండి! డావోస్ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్లకు శ్రీధర్ బాబు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img