epaper
Thursday, January 15, 2026
epaper

ఆయుర్వేద శస్త్రచికిత్సల భ‌ద్ర‌మేనా..?

ఆయుర్వేద శస్త్రచికిత్సల భ‌ద్ర‌మేనా..?
ఆందోళన వ్యక్తం చేస్తున్న అల్లోపతి వైద్యులు
అత్యవసర పరిస్థితులే అసలు పరీక్ష
ప్రాచీన ఆయుర్వేద వారసత్వాన్ని గుర్తుచేస్తున్న ప్రభుత్వం
గ్రామీణ వైద్య సేవలే లక్ష్యమంటున్న ఆయుష్ వర్గాలు
కేంద్రం అనుమ‌తించ‌డంపై భిన్న స్వరాలు
గ్రామీణ ప్రజలకు మేలు లక్ష్యమేనంటు కేంద్రం వివ‌ర‌ణ‌

కాకతీయ, ప్రత్యేక ప్రతినిధి : ఆయుర్వేద వైద్యులు కొన్ని రకాల శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వైద్య రంగంలో చర్చ మొదలైంది. ఈ నిర్ణయం రోగుల భద్రతపై ప్రభావం చూపుతుందా అన్న అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఒకవైపు అల్లోపతి వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ప్రభుత్వం, ఆయుర్వేద నిపుణులు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. అల్లోపతి వైద్య నిపుణుల ప్రకారం, శస్త్రచికిత్స అనేది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఎంబీబీఎస్ ఐదేళ్లు పూర్తిచేసిన తర్వాత మూడేళ్లపాటు ఎంఎస్ వంటి స్పెషలైజేషన్ ద్వారా వేల గంటల ప్రాక్టికల్ శిక్షణ పొందుతారని వారు గుర్తుచేస్తున్నారు. అదే స్థాయిలో లోతైన శిక్షణ ఆయుర్వేద పీజీ వైద్యులకు ఉండకపోవచ్చని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అత్యవసర పరిస్థితులే అసలు పరీక్ష

శస్త్రచికిత్స సమయంలో అనస్థీషియా రియాక్షన్, తీవ్రమైన రక్తస్రావం వంటి అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశముంటుందని వైద్యులు చెబుతున్నారు. అటువంటి సందర్భాల్లో ఆధునిక వైద్య నైపుణ్యం అవసరమవుతుందని, ఆయుర్వేద వైద్యులు వాటిని ఎంతవరకు సమర్థంగా ఎదుర్కోగలరన్నది పెద్ద ప్రశ్నగా మారిందని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఆయుర్వేదానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని స్పష్టం చేస్తోంది. శస్త్రచికిత్సలకు పితామహుడిగా భావించే సుశ్రుతుడు ఆయుర్వేద వైద్యుడేనని గుర్తుచేస్తోంది. ఆధునిక పరిజ్ఞానం, శిక్షణతో ఆయుర్వేద శస్త్రచికిత్సలు చేయడంలో తప్పేమీ లేదని వాదిస్తోంది.

గ్రామీణ ప్రజలకు మేలు లక్ష్యం

గ్రామీణ ప్రాంతాల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరత తీవ్రంగా ఉందని, అటువంటి పరిస్థితుల్లో శిక్షణ పొందిన ఆయుర్వేద వైద్యులు కీలక పాత్ర పోషించగలరని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని రకాల శస్త్రచికిత్సలకు కాకుండా, కేవలం 58 రకాల చిన్నపాటి శస్త్రచికిత్సలకు మాత్రమే అనుమతి ఇచ్చామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అల్లోపతి వైద్యులు మాత్రం ఆయుర్వేదం, అల్లోపతీ కలయిక వల్ల వైద్య విధానాల్లో స్పష్టత కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ‘మిక్సోపతీ’ వల్ల రోగుల ప్రాణాలే పణంగా మారే పరిస్థితి తలెత్తవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఆయుర్వేద శస్త్రచికిత్సల అనుమతిపై తుది ప్రభావం రోగుల భద్రతపైనే ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేద వైద్యులకు ఇచ్చే శిక్షణ నాణ్యత, ఆసుపత్రుల్లో ఉన్న అత్యవసర సదుపాయాలు కీలకమని నిపుణులు చెబుతున్నారు. రోగులు శస్త్రచికిత్సకు ముందు వైద్యుని అనుభవం, ఆసుపత్రి వసతులపై పూర్తి సమాచారం తెలుసుకోవడం అవసరమని సూచిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆర‌ట్టై అప్‌డేట్స్‌..! ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్

కాక‌తీయ‌, ఫీచ‌ర్ డెస్క్ : ప్రస్తుతం ఆరట్టైలో వాయిస్ మరియు వీడియో...

స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులెవరు? అనర్హులెవరు?

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల...

ద‌స‌రా..! దావ‌త్ కా బాప్‌..!!

ద‌స‌రా..! దావ‌త్ కా బాప్‌ స‌రదాల ద‌సార‌కు ఈసారి ఎన్నిక‌ల హైప్ గ్రామ‌మే...

బరువు తగ్గాలని నిమ్మరసం తాగేస్తున్నారా..? ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ తప్పవు

నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని ఔషధ గుణాలు అనేక వ్యాధుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img