epaper
Thursday, January 15, 2026
epaper

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ
రంగంలోకి టీపీసీసీ పరిశీలకులు
జనవరి 1 వరకు క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ
సామాజిక సమీకరణలు, క్లీన్ ఇమేజ్‌కే పెద్దపీట
జిల్లా పరిశీలకులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ (ఐతు)

కాకతీయ, మేడ్చల్ : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన కార్యవర్గ కూర్పుపై పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేలా కమిటీని రూపొందించేందుకు తెలంగాణ పీసీసీ చర్యలు చేపట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు జిల్లా పరిశీలకులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ (ఐతు), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్‌ను నియమించారు.

పరిశీలకుల జిల్లా పర్యటన

బుధవారం జిల్లాకు చేరుకున్న పరిశీలకుల బృందం గురువారం నుంచి జనవరి 1వ తేదీ వరకు ఉప్పల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో పర్యటించనుంది. డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్‌తో పాటు ఆయా నియోజకవర్గాల ఇంచార్జ్‌లు, ముఖ్య నేతలతో సమావేశమై క్షేత్రస్థాయిలో అభిప్రాయాలను సేకరించనున్నారు. నూతన కార్యవర్గ ఎంపికలో టీపీసీసీ పలు కీలక మార్గదర్శకాలను నిర్దేశించింది. రాజకీయ ఉద్యమాల్లో నమోదైన కేసులు మినహా, హత్య, గృహహింస, డ్రగ్స్‌, ఆర్థిక నేరాలు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నవారికి కార్యవర్గంలో చోటు ఉండదని స్పష్టం చేసింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు మహిళలకు 20 నుంచి 25 శాతం వరకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.

జనవరిలో తుది జాబితా

పరిశీలకులు ఇప్పటికే జిల్లా రాజకీయ పరిస్థితులపై పీసీసీ అధ్యక్షుడితో ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు సమాచారం. వారం రోజుల పాటు జరిగే అభిప్రాయ సేకరణ అనంతరం నివేదికను టీపీసీకి సమర్పించనున్నారు. పీసీసీ చీఫ్ ఆమోదంతో జనవరి నెలలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్‌

ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్‌ మంత్రి తుమ్మల నాయకత్వానికి జై కొట్టిన మహిళా...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కాకతీయ, ములుగు ప్రతినిధి :...

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు నిందితుడిగా ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సోదరుడు...

ఏసీపీ నందిరాంపై సస్పెన్ష‌న్ వేటు

ఏసీపీ నందిరాంపై సస్పెన్ష‌న్ వేటు ఆయ‌న‌తో పాటు ఇన్‌స్పెక్టర్‌ గోపి, ఎస్‌ఐ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img