epaper
Thursday, January 15, 2026
epaper

గాంధీ పేరే బీజేపీకి భయం!

గాంధీ పేరే బీజేపీకి భయం!
ఉపాధి హామీ నుంచి పేరు తొలగింపు అప్రజాస్వామికం
లౌకిక దేశంలో మోదీ–అమిత్ షాల పప్పులు ఉడకవు
రాజ్యాంగంపై కుట్రలు జ‌రుగుతున్నాయి..
కేంద్రంలో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి
టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్‌
అధికారం ఉందని దుర్మార్గ నిర్ణయాలు : జూపల్లి కృష్ణారావు

కాకతీయ, హైదరాబాద్ : మహాత్మా గాంధీ పేరు పలికితే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఉలుకే పరిస్థితి ఏర్పడుతుందని టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్‌ ధ్వజమెత్తారు. ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో శనివారం ఎంజీ రోడ్డులో నిర్వహించిన నిర‌స‌న‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గాంధీ కుటుంబం పేరు వింటే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. గాడ్సేను పూజించే వారు కావడంవల్లే గాంధీ పేరును తొలగించాలనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో చర్చించి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది సోనియా గాంధీయేనని గుర్తు చేశారు. పేదలకు ఏడాదికి 100 రోజుల ఉపాధి కల్పించిన ఈ పథకానికి 2014 తర్వాత బీజేపీ ప్రభుత్వం నిధులు కోత పెడుతూ వస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించడం అప్రజాస్వామికమని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ పేరు ప్రజల హృదయాల నుంచి ఎవరూ చెరపలేరన్నారు.

రాజ్యాంగంపై కుట్రలు
రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు బీజేపీ తెరలేపిందని, మనుస్మృతి అమలు చేయాలనే పన్నాగం చేస్తోందని ఆరోపించారు. గాంధీ–నెహ్రూ వారసత్వాన్ని మరిపించాలనే ప్రయత్నాలు ఫలించవన్నారు. లౌకిక దేశంలో మోదీ, అమిత్ షాల పప్పులు ఉడకవని స్పష్టం చేశారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు కర్రకాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు.

అధికారం ఉందని దుర్మార్గపు నిర్ణయాలు : జూపల్లి కృష్ణారావు

అధికారం ఉందన్న అహంకారంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకుంటోందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ప్రతి భారతీయుని గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు. కరువు కాటకాలు, ఆర్థిక కష్టాల సమయంలో అట్టడుగు పేదలకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కోట్లాది పేద కుటుంబాలకు ఉపాధి, గౌరవాన్ని కల్పించిన ఈ గొప్ప పథకాన్ని నేడు బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఉన్న రాజకీయ కక్షతోనే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి విరుద్ధమని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఈ చట్టాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు గ్రామాలు, ప్రజలు ఏకం కావాలని జూపల్లి పిలుపునిచ్చారు. అందరూ ఒక్కతాటిపైకి వచ్చి ఈ అన్యాయ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌, ఎమ్మెల్యే వెడమ బొజ్జు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్‌

ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్‌ మంత్రి తుమ్మల నాయకత్వానికి జై కొట్టిన మహిళా...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కాకతీయ, ములుగు ప్రతినిధి :...

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు నిందితుడిగా ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సోదరుడు...

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ రంగంలోకి టీపీసీసీ పరిశీలకులు జనవరి 1 వరకు క్షేత్రస్థాయిలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img