epaper
Thursday, January 15, 2026
epaper

విరాళాల పేరుతో రూ.415 కోట్లు దోచేసిన అల్‌-ఫలా.. వెలుగులోకి బిగ్‌ స్కామ్!

విరాళాల పేరుతో రూ.415 కోట్లు దోచేసిన అల్‌-ఫలా.. వెలుగులోకి బిగ్‌ స్కామ్!
ఢిల్లీ బ్లాస్ట్ తరువాత వెలుగులోకి వచ్చిన అల్‌-ఫలా స్కామ్‌
అక్రిడేషన్ లేకుండానే కోట్ల రూపాయల వసూళ్లు
పన్ను రిటర్నుల్లో కూడా అదే ట్రిక్

కాక‌తీయ‌, జాతీయం : ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత వెలుగులోకి వచ్చిన తాజా దర్యాప్తులు అల్‌-ఫలా యూనివర్సిటీని దేశవ్యాప్తంగా చర్చకు తెచ్చాయి. ఇటీవల ఫరీదాబాద్‌లో గుర్తించిన ఉగ్ర మాడ్యూల్ సభ్యులకు అల్‌-ఫలా యూనివర్సిటీతో లింకులు ఉన్నాయన్న విష‌యం బ‌య‌ట‌కు రావడంతో ఇండియన్ యూనివర్సిటీల అసోసియేషన్ (AIU) వెంట‌నే స‌ద‌రు సంస్థ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అలాగే ఫోర్జరీ, మోసం ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఇప్ప‌టికే సంస్థపై రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. న్యాక్ కూడా యూనివర్సిటీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

మ‌రోవైపు మంగళవారం ఈడీ అధికారులు యూనివర్సిటీపై నిర్వహించిన దాడుల్లో భారీ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. అల్‌-ఫలా యూనివర్సిటీకి సరైన అక్రిడేషన్ లేకపోయినా, అది పూర్తి స్థాయి యూనివర్సిటీలా నడుపుతూ, విద్యార్థుల నుంచి సంవత్సరాల తరబడి భారీ ఫీజులు వసూలు చేశారు. అదీకాక, ఫీజులను స్వచ్ఛంద విరాళాలుగా చూపించడం అతిపెద్ద గోల్‌మాల్. 2014–15 నుండి 2024–25 వరకు ఏకంగా రూ.415.10 కోట్లు యూనివర్సిటీ ఖాతాల్లోకి రాగా.. ఈ భారీ మొత్తాన్ని అక్రమంగా విరాళాలుగా మార్చేశార‌ని అధికారులు గుర్తించారు. గత 10 సంవత్సరాల పన్ను రిటర్నుల్లో కూడా యూనివర్సిటీ ఇదే పద్ధతిని కొనసాగించినట్లు అధికారులు వెల్ల‌డించారు. ఫీజుల రూపంలో వచ్చిన మొత్తాన్ని డొనేషన్స్‌గా చూపించడం, పన్నుల ఎగవేత వంటి అంశాలు మనీ లాండరింగ్ అనుమానాలకు దారితీసింది.

మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు పురోగమిస్తుండగా.. యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం, ట్రస్టీల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ఈ సోదాల్లో రూ.48 లక్షలకు పైగా నగదు, డిజిటల్ పరికరాలు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం దర్యాప్తులో భాగంగా యూనివర్సిటీ ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్దిఖీని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. నిధుల ప్రవాహం, లావాదేవీల వివరాలు, అక్రమంగా మార్చిన ఫీజు మొత్తాలు ఎక్కడికి వెళ్లాయన్నది ఈడీ ప్రస్తుతం లోతుగా విచారిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img