epaper
Monday, March 2, 2026
epaper

చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా!!!

చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా!!!
పదిమంది విద్యార్థుల విద్యా బాధ్యతలను తీసుకున్న
విద్యా సంస్కర్త తాటిపల్లి శంకర్ బాబు

కాకతీయ, కొత్తగూడెం రూరల్: చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే బ్రతుకు పెద్ద సున్నరా… అని దిశా నిర్దేశం చేసిన మన విద్యా సంస్కర్తల స్ఫూర్తిని ప్రతీ విద్యార్థినీ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు గ్రహించాలని, శ్రీ సరస్వతి శిశు మందిర్ కమిటీ అధ్యక్షులు, విద్యా సంస్కర్త తాటిపల్లి శంకర్ బాబు సూచించారు. కొత్తగూడెం పట్టణం, కూలీలైన్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో జరిగిన విద్యార్థుల, తల్లిదండ్రుల, పాఠశాల కమిటీ, పుర ప్రముఖుల కమిటీ, కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. శ్రీ సరస్వతి శిశు మందిరాలు దేశవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థుల భవితవ్యానికి, దేశభక్తికి నిలయంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. శిశు మందిరాలలో ప్రాంతీయ భాష, దేశ భాష తోపాటు సదాచారం, సంస్కృత విద్యలతో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు దేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలయ్యాయని ఆయన అభివర్ణించారు.

ఈ పాఠశాలలో చదివే విద్యార్థులకు తల్లిదండ్రులన్నా దైవ సన్నిధులురా!! అనే దృక్పథం, దేశభక్తి, శిశు తరగతుల నుండి అలవడుతాయన్నారు. పాఠశాలలో చదివే పదిమంది పేద విద్యార్థులకు ఆయన పాఠశాల ఫీజును స్కాలర్షిప్ గా ప్రకటించారు. పాఠశాలకు అవసరమైన, విద్యార్థులు కూర్చునే బల్లలను, టెలివిజన్ ను బహుకరించారు. దేశభక్తి ధ్యేయంగా సాగుతున్న శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు విద్యాసంస్కర్తలు స్కాలర్షిప్లు ఇచ్చుటకు ముందుకు రావాలని, విద్యాదానం మహాదానమని ఆయన పిలుపునిచ్చారు. పాఠశాలల అభివృద్ధికి విద్యాసంస్కర్తలు దోహదపడాలని ఆయన పిలుపునిచ్చారు. శిశు మందిరాల కమిటీలో సాగుతున్న ప్రతీ విద్యా సంస్కర్త పాఠశాలకు ఏదో ఒక రూపేనా సహకరించి అభివృద్ధికి దోహదపడాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. . ఈ కార్యక్రమంలో పాఠశాల కోశాధికారి ఆర్.ఎస్. రామానుజమ్ మాట్లాడుతూ పాఠశాల ప్రభుత్వ గుర్తింపు అనుమతులతో రాష్ట్ర ప్రభుత్వ విద్యా విషయ సూచనల ప్రకారం 1994 నుండి కొత్తగూడెం కూలీ లైన్ లో శ్రీ సరస్వతీ శిశుమందిర్ దినదినాభివృద్ధి చెందుతూ వర్ధిల్లుతుందని అన్నారు.

శ్రీ సరస్వతీ విద్యా పీఠం అనుబంధంగా నడిచే శ్రీ సరస్వతీ శిశుమందిరాల ఆచార్యులకు విద్యా పీఠం ప్రత్యేక శిక్షణను అందిస్తూ, దేశ భక్తిని పెంపొందించే దిశగా పాఠశాలను నిర్వహిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధుల తల్లిదండ్రులు పాఠశాల కమిటీ సభ్యులు, సమితి సభ్యులు, ఆచార్యులు, శ్రీ సరస్వతీ శిశుమందిర్ అధ్యక్షులు, విద్యా సంస్కర్త తాటిపల్లి శంకర్ బాబు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సమితీ అధ్యక్షులు పిల్లి రాజేశ్వరరావు ప్రబంధకారిణి, సభ్యులు మోడెమ్ మోహన్ రావు, ప్రధానాచార్య జి. స్రవంతి, గణిత శాస్త్ర విభాగ ఆచార్య రజిని, ఇంగ్లీష్ విభాగ ఆచార్య కల్పన, సైన్స్ విభాగ ఆచార్య కల్పన, సామాజిక శాస్త్రం ఆచార్యులు సాహిత్య, కిండర్ గార్డెన్ విభాగ ఆచార్యులు పద్మ, నర్సరీ విభాగ ఆచార్యులు ఆఫ్రిన్ లు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img