epaper
Saturday, November 15, 2025
epaper

చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా!!!

చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా!!!
పదిమంది విద్యార్థుల విద్యా బాధ్యతలను తీసుకున్న
విద్యా సంస్కర్త తాటిపల్లి శంకర్ బాబు

కాకతీయ, కొత్తగూడెం రూరల్: చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే బ్రతుకు పెద్ద సున్నరా… అని దిశా నిర్దేశం చేసిన మన విద్యా సంస్కర్తల స్ఫూర్తిని ప్రతీ విద్యార్థినీ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు గ్రహించాలని, శ్రీ సరస్వతి శిశు మందిర్ కమిటీ అధ్యక్షులు, విద్యా సంస్కర్త తాటిపల్లి శంకర్ బాబు సూచించారు. కొత్తగూడెం పట్టణం, కూలీలైన్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో జరిగిన విద్యార్థుల, తల్లిదండ్రుల, పాఠశాల కమిటీ, పుర ప్రముఖుల కమిటీ, కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. శ్రీ సరస్వతి శిశు మందిరాలు దేశవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థుల భవితవ్యానికి, దేశభక్తికి నిలయంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. శిశు మందిరాలలో ప్రాంతీయ భాష, దేశ భాష తోపాటు సదాచారం, సంస్కృత విద్యలతో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు దేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలయ్యాయని ఆయన అభివర్ణించారు.

ఈ పాఠశాలలో చదివే విద్యార్థులకు తల్లిదండ్రులన్నా దైవ సన్నిధులురా!! అనే దృక్పథం, దేశభక్తి, శిశు తరగతుల నుండి అలవడుతాయన్నారు. పాఠశాలలో చదివే పదిమంది పేద విద్యార్థులకు ఆయన పాఠశాల ఫీజును స్కాలర్షిప్ గా ప్రకటించారు. పాఠశాలకు అవసరమైన, విద్యార్థులు కూర్చునే బల్లలను, టెలివిజన్ ను బహుకరించారు. దేశభక్తి ధ్యేయంగా సాగుతున్న శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు విద్యాసంస్కర్తలు స్కాలర్షిప్లు ఇచ్చుటకు ముందుకు రావాలని, విద్యాదానం మహాదానమని ఆయన పిలుపునిచ్చారు. పాఠశాలల అభివృద్ధికి విద్యాసంస్కర్తలు దోహదపడాలని ఆయన పిలుపునిచ్చారు. శిశు మందిరాల కమిటీలో సాగుతున్న ప్రతీ విద్యా సంస్కర్త పాఠశాలకు ఏదో ఒక రూపేనా సహకరించి అభివృద్ధికి దోహదపడాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. . ఈ కార్యక్రమంలో పాఠశాల కోశాధికారి ఆర్.ఎస్. రామానుజమ్ మాట్లాడుతూ పాఠశాల ప్రభుత్వ గుర్తింపు అనుమతులతో రాష్ట్ర ప్రభుత్వ విద్యా విషయ సూచనల ప్రకారం 1994 నుండి కొత్తగూడెం కూలీ లైన్ లో శ్రీ సరస్వతీ శిశుమందిర్ దినదినాభివృద్ధి చెందుతూ వర్ధిల్లుతుందని అన్నారు.

శ్రీ సరస్వతీ విద్యా పీఠం అనుబంధంగా నడిచే శ్రీ సరస్వతీ శిశుమందిరాల ఆచార్యులకు విద్యా పీఠం ప్రత్యేక శిక్షణను అందిస్తూ, దేశ భక్తిని పెంపొందించే దిశగా పాఠశాలను నిర్వహిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధుల తల్లిదండ్రులు పాఠశాల కమిటీ సభ్యులు, సమితి సభ్యులు, ఆచార్యులు, శ్రీ సరస్వతీ శిశుమందిర్ అధ్యక్షులు, విద్యా సంస్కర్త తాటిపల్లి శంకర్ బాబు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సమితీ అధ్యక్షులు పిల్లి రాజేశ్వరరావు ప్రబంధకారిణి, సభ్యులు మోడెమ్ మోహన్ రావు, ప్రధానాచార్య జి. స్రవంతి, గణిత శాస్త్ర విభాగ ఆచార్య రజిని, ఇంగ్లీష్ విభాగ ఆచార్య కల్పన, సైన్స్ విభాగ ఆచార్య కల్పన, సామాజిక శాస్త్రం ఆచార్యులు సాహిత్య, కిండర్ గార్డెన్ విభాగ ఆచార్యులు పద్మ, నర్సరీ విభాగ ఆచార్యులు ఆఫ్రిన్ లు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..?? ద‌ర్యాప్తు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు..? ర‌క్త‌చ‌రిత్ర‌లో రాజ‌కీయ కోణంపై...

ఎన్ డి ఎ కూటమి విజయం

ఎన్ డి ఎ కూటమి విజయం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మండల...

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ ప్రజల...

భళారే.. యమ

భళారే.. యమ పిల్లల పండుగ రోజున అలరించిన బుడతడు కాకతీయ కొత్తగూడెం రూరల్: బాలల...

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట…

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట... రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, చేనేత...

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ నాయకుడు,...

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డాక్టర్ దుర్గాభవాని కాకతీయ, పినపాక:...

సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది…

సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది... పిల్లలను స్వేచ్ఛగా వివక్షతరహితంగా పెంచాలి... స్మార్ట్ కిడ్జ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img