epaper
Thursday, January 15, 2026
epaper

రిమాండ్‌కు యాదగిరిగుట్ట ఆలయ విద్యుత్ ఈఈ

  • రూ.1.90 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబ‌డిన రామారావు
  • అవినీతి ఆరోపణలతో గ‌తంలోనూ సస్పెన్ష‌న్‌

కాకతీయ‌, తెలంగాణ బ్యూరో: యాదగిరిగుట్ట ఆలయ ఎలక్ట్రికల్‌ ఈఈ ఊడెపు రామారావును ఏసీబీ అధికారులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. ప్రసాదాల మెషీన్ల మెయింటెనెన్స్‌ బిల్లుగా రూ.11.50 లక్షలు రావాల్సి ఉండ‌గా కాంట్రాక్టర్‌ నుంచి 20 శాతం కమీషన్‌ కోరాడు. కాంట్రాక్టర్‌ ఫిర్యాదు మేరకు మేడిపల్లి మెడ్‌ప్లస్‌ వద్ద రూ.1.90 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ టీం అతడిని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్ర ఆధ్వ‌ర్యంలో రామారావు కార్యాలయంలో సోదాలు జరిపి పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. అవినీతి ఆరోపణలతో సస్పెండ్‌ అయ్యి మూడు నెలల క్రితం తిరిగి డ్యూటీకి వచ్చిన రామారావు.. ఇటీవల ఎండోమెంట్‌ ఎస్‌ఈగా ప్రమోషన్‌ పొందిన విషయం తెలిసిందే .

సంచ‌ల‌నం సృష్టించిన ఘ‌ట‌న‌

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట‌ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ రామారావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనం సృష్టించింది. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన ఉపేందర్, సందీప్‌రెడ్డి అనే కాంట్రాక్టర్లు గత సంవత్సరం ఆలయంలోని లడ్డూ, పులిహోర ప్రసాదం తయారీ మిషన్ల నిర్వహణ టెండర్‌ను రూ. 10 లక్షలకు దక్కించుకున్నారు. అయితే.. గత సంవత్సర కాలంగా వారికి రావాల్సిన బిల్లులు మంజూరు కాలేదు. దీంతో ఉపేందర్, సందీప్‌రెడ్డి ఈఈ రామారావును బిల్లుల కోసం కొన్ని నెలలుగా కోరుతున్నారు. ఈఈ రామారావు బిల్లులు మంజూరు చేయడానికి గాను.. మొత్తం రూ. 10 లక్షల బిల్లులలో రూ. 2 లక్షలు తనకు లంచంగా ఇవ్వాలని నిస్సిగ్గుగా డిమాండ్‌ చేశారు. చివరకు రూ. 1.90 లక్షలకు బేరం కుదిరింది. కాంట్రాక్టర్లు ఈ విషయాన్ని రెండు నెలల క్రితమే ఏసీబీ అధికారులకు చేరవేశారు. ఇవాళ రూ. 1.90 లక్షలు తీసుకుంటుండగా, మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img