epaper
Sunday, March 1, 2026
epaper

ఆ న‌లుగురు రాజీనామా చేస్తారా..?!

ఆ న‌లుగురు రాజీనామా చేస్తారా..?!
ఫిరాయించిన ఎమ్మెల్యేలపై జోరుగా ప్ర‌చారం
క‌డియం, తెల్లం , దానం , పోచారంల నిర్ణ‌యంపై విశ్లేష‌ణ‌లు
స్పీక‌ర్ నోటీసుల నేప‌థ్యంలో గౌర‌వంగా త‌ప్పుకునే అవ‌కాశ‌మంటూ చ‌ర్చ‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిన న‌లుగురు ఎమ్మెల్యేల‌కు రాజీనామాల‌కు సిద్ధ‌ప‌డిన‌ట్లుగా జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి, భ‌ద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంక‌ట్రావ్‌, ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌, బాన్స‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస‌రెడ్డిలు ఆ త‌ర్వాత ప‌రిణామాల్లో కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్న విష‌యం తెలిసిందే. వీరితో పాటు అరికపూడి గాంధీ, కాలె యాదయ్య, బండ్ల క్రిష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, డాక్టర్‌ సంజయ్‌, ప్రకాశ్‌గౌడ్‌లు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్‌, పాడి కౌశిక్‌రెడ్డి వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌తోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వేసిన రిట్‌ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో అసెంబ్లీ స్పీక‌ర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపు విషయంలో బీఆర్ఎస్‌ ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. శాసనసభ స్పీకర్‌ కార్యాలయం నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పంపించారు.

ఇప్పుడేం చేద్దాం..! పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అంత‌ర్మ‌థ‌నం..!
స్పీకర్‌ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్నది ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తికరంగా మారింది. స్పీక‌ర్ నోటీసులు జారీ చేశార‌న్న విష‌యం తెలియ‌గానే.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మీడియాతో స్పందించారు. తాను పార్టీ మారలేదని, టెక్నికల్‌గా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిశానని తెలిపారు. ఇప్పటికీ తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. ఇక మిగ‌తా ఎమ్మెల్యేలు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఎలాంటి బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేయ‌డం లేదు.ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌నే యోచ‌న‌లోనే ఉండ‌టం గ‌మ‌నార్హం. న్యాయ నిపుణుల‌తో మాట్లాడిన త‌ర్వాత‌…నోటీసులపై స్పందించాల‌ని ప్ర‌స్తుతానికి మౌనాన్ని ఆశ్ర‌యిస్తున్నారు.

ఆ న‌లుగురు రాజీనామాకు సిద్ధ‌మా..?!
స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి, భ‌ద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంక‌ట్రావ్‌, ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌, బాన్స‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస‌రెడ్డిలు మాత్రం స్పీక‌ర్ నోటీసుల జారీ నేప‌థ్యంలో ఎమ్మెల్యేల ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తార‌న్న చ‌ర్చ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది.
పార్టీ కండువా క‌ప్పుకోవ‌డంతో పాటు కాంగ్రెస్ స్టాండ్ తీసుకుని క్లియ‌ర్ డైరెక్ష‌న్‌లో ఉండ‌టంతోవీరిపై స్పీక‌ర్‌కు చ‌ర్య‌లు తీసుకోక త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితులు నెల‌కొనిఉన్నాయ‌న్న అభిప్రాయం, విశ్లేష‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈనేప‌థ్యంలోనే ఈ న‌లుగురు ఎమ్మెల్యేలు గౌర‌వ‌ప్ర‌దంగా రాజీనామాలు చేసే ఆలోచ‌న‌తో ఉన్నార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. చూడాలి ఏం జ‌రుగుతుందో మ‌రి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీకి వినతిపత్రం...

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం జీవో 252 ప్రకారం అమలు…...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ రూ.50 వేలు డిమాండ్‌… ఏసీబీ ట్రాప్‌లో...

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలి 8,203 పోలింగ్ కేంద్రాల్లో భద్రత...

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం ఎన్‌సీసీ సేవలను ప్రశంసించిన జిష్ణు దేవ్...

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర!

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర! దొడ్డిదారిన నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నం నిరుద్యోగుల నోట్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img