epaper
Saturday, November 15, 2025
epaper

ఆ న‌లుగురు రాజీనామా చేస్తారా..?!

ఆ న‌లుగురు రాజీనామా చేస్తారా..?!
ఫిరాయించిన ఎమ్మెల్యేలపై జోరుగా ప్ర‌చారం
క‌డియం, తెల్లం , దానం , పోచారంల నిర్ణ‌యంపై విశ్లేష‌ణ‌లు
స్పీక‌ర్ నోటీసుల నేప‌థ్యంలో గౌర‌వంగా త‌ప్పుకునే అవ‌కాశ‌మంటూ చ‌ర్చ‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిన న‌లుగురు ఎమ్మెల్యేల‌కు రాజీనామాల‌కు సిద్ధ‌ప‌డిన‌ట్లుగా జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి, భ‌ద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంక‌ట్రావ్‌, ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌, బాన్స‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస‌రెడ్డిలు ఆ త‌ర్వాత ప‌రిణామాల్లో కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్న విష‌యం తెలిసిందే. వీరితో పాటు అరికపూడి గాంధీ, కాలె యాదయ్య, బండ్ల క్రిష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, డాక్టర్‌ సంజయ్‌, ప్రకాశ్‌గౌడ్‌లు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్‌, పాడి కౌశిక్‌రెడ్డి వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌తోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వేసిన రిట్‌ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో అసెంబ్లీ స్పీక‌ర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపు విషయంలో బీఆర్ఎస్‌ ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. శాసనసభ స్పీకర్‌ కార్యాలయం నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పంపించారు.

ఇప్పుడేం చేద్దాం..! పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అంత‌ర్మ‌థ‌నం..!
స్పీకర్‌ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్నది ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తికరంగా మారింది. స్పీక‌ర్ నోటీసులు జారీ చేశార‌న్న విష‌యం తెలియ‌గానే.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మీడియాతో స్పందించారు. తాను పార్టీ మారలేదని, టెక్నికల్‌గా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిశానని తెలిపారు. ఇప్పటికీ తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. ఇక మిగ‌తా ఎమ్మెల్యేలు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఎలాంటి బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేయ‌డం లేదు.ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌నే యోచ‌న‌లోనే ఉండ‌టం గ‌మ‌నార్హం. న్యాయ నిపుణుల‌తో మాట్లాడిన త‌ర్వాత‌…నోటీసులపై స్పందించాల‌ని ప్ర‌స్తుతానికి మౌనాన్ని ఆశ్ర‌యిస్తున్నారు.

ఆ న‌లుగురు రాజీనామాకు సిద్ధ‌మా..?!
స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి, భ‌ద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంక‌ట్రావ్‌, ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌, బాన్స‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస‌రెడ్డిలు మాత్రం స్పీక‌ర్ నోటీసుల జారీ నేప‌థ్యంలో ఎమ్మెల్యేల ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తార‌న్న చ‌ర్చ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది.
పార్టీ కండువా క‌ప్పుకోవ‌డంతో పాటు కాంగ్రెస్ స్టాండ్ తీసుకుని క్లియ‌ర్ డైరెక్ష‌న్‌లో ఉండ‌టంతోవీరిపై స్పీక‌ర్‌కు చ‌ర్య‌లు తీసుకోక త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితులు నెల‌కొనిఉన్నాయ‌న్న అభిప్రాయం, విశ్లేష‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈనేప‌థ్యంలోనే ఈ న‌లుగురు ఎమ్మెల్యేలు గౌర‌వ‌ప్ర‌దంగా రాజీనామాలు చేసే ఆలోచ‌న‌తో ఉన్నార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. చూడాలి ఏం జ‌రుగుతుందో మ‌రి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉద్రిక్తత కాకతీయ, హుజురాబాద్:...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..!

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..! జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి.. కాక‌తీయ‌, హైదరాబాద్ : జూబ్లీహిల్స్...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

క‌వి అందె శ్రీ క‌న్నుమూత‌

క‌వి అందె శ్రీ క‌న్నుమూత‌ కాక‌తీయ‌, హైద‌రాబాద్ : వాగ్గేయ‌కారుడు, క‌వి అందె...

“ఓటు అమ్మకండి, పిల్లల భవిష్యత్తు ఉరితీయకండి”.

“ఓటు అమ్మకండి, పిల్లల భవిష్యత్తు ఉరితీయకండి". జూబ్లీహిల్స్‌లో స్వతంత్ర అభ్యర్థి కోట శ్యామ్‌కుమార్...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

కాంగ్రెస్‌తోనే హైద‌రాబాద్ అభివృద్ధి

కాంగ్రెస్‌తోనే హైద‌రాబాద్ అభివృద్ధి ఓఆర్‌ఆర్, ఎయిర్‌పోర్టు, మెట్రోను తీసుకొచ్చాం రాజ‌ధాని మునిగిపోతే కేంద్రం చిల్లిగవ్వ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img