అసాంఘీక కార్యకలాపాలకు అడ్డకట్ట వేస్తా
– కోట విలేకర్లతో ఎస్.ఐ వల్లి పద్మ
కాకతీయ – ఏలూరు ప్రతినిధి : ప్రజలకు అందుబాటులో ఉంటూ, మహిళల రక్షణకు మరియు అసాంఘిక కార్యకలాపాల అదుపునకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని తడికలపూడి నూతన సబ్ ఇన్స్పెక్టర్ వల్లి పద్మ స్పష్టం చేశారు. ఆదివారం కామవరపుకోట ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తనను కలిసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా విధులను నిర్వహిస్తానని ఆమె పేర్కొన్నారు. అనంతరం కామవరపుకోట ప్రెస్ క్లబ్ సభ్యులు ఎస్ఐ వల్లి పద్మను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎస్.ఐను కలిసిన వారిలో కామవరపుకోట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దాసి భూషణం, ఉపాధ్యక్షుడు రొక్కం సత్యనారాయణ, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఉస్సే లక్ష్మీనారాయణ, కోశాధికారి ఇమ్మడి వీరభద్ర స్వామి, వడ్డేపల్లి అభిషేక్, వైవిఎస్ రామచంద్ర రావు తదితర విలేకర్లు ఉన్నారు.


