epaper
Thursday, January 15, 2026
epaper

ఏళ్ల తరబడి పాతుకుపోతే సహించం

ఏళ్ల తరబడి పాతుకుపోతే సహించం
ఆడిట్ చేసి ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలి
ఖ‌మ్మం జిల్లా . టీడబ్ల్యూజేఎఫ్ నాయ‌కులు ధ్వ‌జం
టీడబ్ల్యూజేఎఫ్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శుల‌కు స‌న్మానం

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ వ్యవహారాలపై ఇకపై నిర్ల‌క్ష్యాన్ని సహించబోమని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకత్వం స్పష్టం చేసింది. టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా దగ్గుపాటి మాధవ్, కార్యదర్శిగా నూకల రామచంద్ర మూర్తి (కాకతీయ దినపత్రిక ఖమ్మం స్టాఫ‌ర్) సోమవారం జిల్లా బాధ్యుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష–కార్యదర్శులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఖదీర్, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం ప్రెస్ క్లబ్‌కు గొప్ప చరిత్ర ఉందని, ఇది ఒక్క వర్గానికో, ఒక్క యూనియన్‌కో చెందినది కాదని, ప్రతి జర్నలిస్టుకూ హక్కు ఉన్న ఉమ్మడి వేదిక అని స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ నిర్వహణలో నెలకొన్న అవకతవకలపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

సామాన్యుల గొంతుకగా ప్రెస్ క్లబ్ మారాలి

నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షుడు దగ్గుపాటి మాధవ్, కార్యదర్శి నూకల రామచంద్ర మూర్తి మాట్లాడుతూ… తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా నాయకత్వ సూచనల మేరకు ప్రెస్ క్లబ్ నిర్వహణలో కొత్త మార్పులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇకపై ప్రెస్ క్లబ్ సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థి సంఘాలు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకునే వేదికగా మారేలా కృషి చేస్తామన్నారు. టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ముఖ్య నాయకులతో పాటు ప్రజా సంఘాలతో సమన్వయం చేసుకుని ప్రెస్ క్లబ్ అభివృద్ధికి పాటుపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షుడు దువ్వా సాగర్, ట్రెజరర్ తేనె వెంకటేశ్వర్లు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష–కార్యదర్శులు ఆవుల శ్రీను, రవికిరణ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మధుశ్రీ, జిల్లా వీడియో గ్రాఫర్ల అధ్యక్ష–కార్యదర్శులు ఫయాజ్, గణేష్, డెస్క్ జర్నలిస్టు అధ్యక్షుడు అక్కిరెడ్డి, నగర అధ్యక్ష–కార్యదర్శులు రాజేంద్ర మూర్తి, వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు నాగలక్ష్మి, వి6 గోపి, హర్షద్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img