epaper
Saturday, November 15, 2025
epaper

అర్హులైన ప్రతి ఒక్కరికీ ‘సంక్షేమ ఫలాలు’

అర్హులైన ప్రతి ఒక్కరికీ ‘సంక్షేమ ఫలాలు’
గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు
స్థానిక బీటీపీఎస్ లో యువతకు అవకాశాలు
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

కాకతీయ, పినపాక: అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు గా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం పినపాక మండలం జానంపేట గ్రామంలో ఆయన పర్యటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ అప్పులకు వడ్డీ కడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వని గ్రామం అంటూ తెలంగాణలో లేదన్నారు. సంక్షేమ పథకాలు అందించడంలో ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుందని తెలిపారు. ఆనాటి నెహ్రూ ప్రభుత్వం నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ,ఎస్టీ ,బీసీల సంక్షేమం కోసం పెద్దపీట వేసిందని తెలిపారు. రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేసే వారమన్నారు. కానీ బిజెపి బీఆర్ఎస్ ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించామని తెలిపారు. కావాలని కోర్టుకు వెళ్లి బీసీలకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. బిజెపికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదించాలన్నారు. అనంతరం జానంపేట ఎస్సీ కాలనీ నుండి 40 కుటుంబాలు ఎమ్మెల్యే పాయం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ కొండంత అండగా ఉంటుందని తెలిపారు. దళిత కాలనీలో అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతుందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ధన ప్రవాహంతో గత బిఆర్ఎస్ నాయకులు ఏమి చేయాలో పాలు పోక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్తారన్నారు.

ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి ప్రతిపక్షాల నోరుమూయించాలన్నారు. అనంతరం జానంపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించారు. ఇల్లు రాని ప్రతి పేదవాడికి ,అర్హుడికి ఇల్లులు రెండో విడతలో కేటా ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు బోడ రమేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మనోజ్, మాజీ ఎంపీటీసీ హరీష్, కాంగ్రెస్, నాయకులు పేరం వెంకటేశ్వర్లు, రాజేష్, చందర్రావు, లక్ష్మణ్, గంగిరెడ్డి వెంకటరెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోకల కేశవులు, సుంకరి , కేత ప్రసాదు, స్వతంత్ర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..?? ద‌ర్యాప్తు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు..? ర‌క్త‌చ‌రిత్ర‌లో రాజ‌కీయ కోణంపై...

ఎన్ డి ఎ కూటమి విజయం

ఎన్ డి ఎ కూటమి విజయం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మండల...

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ ప్రజల...

భళారే.. యమ

భళారే.. యమ పిల్లల పండుగ రోజున అలరించిన బుడతడు కాకతీయ కొత్తగూడెం రూరల్: బాలల...

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట…

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట... రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, చేనేత...

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ నాయకుడు,...

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డాక్టర్ దుర్గాభవాని కాకతీయ, పినపాక:...

సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది…

సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది... పిల్లలను స్వేచ్ఛగా వివక్షతరహితంగా పెంచాలి... స్మార్ట్ కిడ్జ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img