epaper
Sunday, March 1, 2026
epaper

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు
15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన
అభిషేకం పాలలో పురుగులు కనిపించిన ఘటన
ప్రసాద కౌంటర్ వద్ద విద్యుత్ షాక్ కలకలం
ఆలయ నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతున్న భక్తులు

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : విజయవాడలోని ప్రముఖ కనకదుర్గమ్మ ఆలయంలో 2026 జనవరి నెలలో వరుసగా చోటుచేసుకున్న ఘటనలు భక్తుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలో మూడు కీలక సంఘటనలు జరగడం ఆలయ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జనవరి 10న అమ్మవారికి నిర్వహించే శ్రీచక్ర అర్చన కోసం సిద్ధం చేసిన పాలలో పురుగులు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. పూజ కోసం తాజాగా సేకరించిన గోవు పాలకు బదులుగా టెట్రా ప్యాక్ పాలను ఉపయోగించడంపై అర్చకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో కొంతసేపు అర్చన నిలిచిపోవడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.

ప్రసాద కౌంటర్ వద్ద షాక్

ఇదే సమయంలో ఆలయంలో ప్రసాదం పంపిణీ చేసే కౌంటర్ల వద్ద భక్తులు విద్యుత్ షాక్‌కు గురైనట్లు సమాచారం వెలువడింది. భద్రతా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు భక్తుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు 2025 డిసెంబర్ 27న విద్యుత్ బకాయిల కారణంగా కనకదుర్గమ్మ ఆలయానికి కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంది. అయితే, వరుసగా ఈ మూడు సంఘటనలు జరగడం ఆలయ పరిపాలనలో సమన్వయం లోపించిందని, భక్తుల భద్రత, ఆధ్యాత్మిక విశ్వాసాల పట్ల నిర్లక్ష్యం కనిపిస్తోందని భక్తులు విమర్శిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img