epaper
Thursday, January 15, 2026
epaper

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు
15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన
అభిషేకం పాలలో పురుగులు కనిపించిన ఘటన
ప్రసాద కౌంటర్ వద్ద విద్యుత్ షాక్ కలకలం
ఆలయ నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతున్న భక్తులు

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : విజయవాడలోని ప్రముఖ కనకదుర్గమ్మ ఆలయంలో 2026 జనవరి నెలలో వరుసగా చోటుచేసుకున్న ఘటనలు భక్తుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలో మూడు కీలక సంఘటనలు జరగడం ఆలయ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జనవరి 10న అమ్మవారికి నిర్వహించే శ్రీచక్ర అర్చన కోసం సిద్ధం చేసిన పాలలో పురుగులు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. పూజ కోసం తాజాగా సేకరించిన గోవు పాలకు బదులుగా టెట్రా ప్యాక్ పాలను ఉపయోగించడంపై అర్చకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో కొంతసేపు అర్చన నిలిచిపోవడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.

ప్రసాద కౌంటర్ వద్ద షాక్

ఇదే సమయంలో ఆలయంలో ప్రసాదం పంపిణీ చేసే కౌంటర్ల వద్ద భక్తులు విద్యుత్ షాక్‌కు గురైనట్లు సమాచారం వెలువడింది. భద్రతా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు భక్తుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు 2025 డిసెంబర్ 27న విద్యుత్ బకాయిల కారణంగా కనకదుర్గమ్మ ఆలయానికి కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంది. అయితే, వరుసగా ఈ మూడు సంఘటనలు జరగడం ఆలయ పరిపాలనలో సమన్వయం లోపించిందని, భక్తుల భద్రత, ఆధ్యాత్మిక విశ్వాసాల పట్ల నిర్లక్ష్యం కనిపిస్తోందని భక్తులు విమర్శిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

హంపికి మోదీ అభినందనలు

హంపికి మోదీ అభినందనలు ఫిడే వరల్డ్ రాపిడ్ చెస్‌లో కాంస్య పతకం న్యూఢిల్లీ/దోహా :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img