epaper
Thursday, January 15, 2026
epaper

ఏసీబీ వలలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, రేషన్ షాప్ డీలర్

ఏసీబీ వలలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, రేషన్ షాప్ డీలర్

కాకతీయ, ఇల్లందు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో సోమవారం ఏసీబీ అధికారులు సివిల్ సప్లయ్ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డి.ఎస్.పి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక రేషన్ షాప్ డీలర్ వద్దనుండి రూ.30 వేలు అవినీతికి పాల్పడడంతో ఇల్లందు సివిల్ సప్లై డిటి మహమ్మద్ యాకూబ్ పాషా, ఆపరేటర్ విజయ్ తో సహా రేషన్ డీలర్స్ సంఘం అధ్యక్షులు శబరిస్ ను అవినీతి నిరోధక డిఎస్పి వై రమేష్ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.పట్టణంలోని ఓ రేషన్ షాపులో తనిఖీకి వెళ్ళిన డిటి యాకూబ్ పాషా, కంప్యూటర్ ఆపరేటర్ విజయ్ లు స్టాక్ తక్కువగా ఉండడంతో కేస్ మాఫ్ చేయడం కోసం రూ.30 వేలు లంచం ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అయితే పైకాన్ని రేషన్ షాప్ డీలర్స్ అధ్యక్షుడు శబరీష్ కు ఇవ్వాలని సూచించారు. చేసేది ఏమీ లేక ఆ డీలర్ ఏసీబీ అధికారులను సంప్రదించగా ఉద్యోగులు ఇవ్వమన్న చొట డబ్బు ఇవ్వమని ఆదేశించారు. వారి సూచనల మేరకు జగదాంబ సెంటర్లో శబరిస్ నడుపుతున్న సెల్ షాప్ వద్దకు వెళ్లి ఆ డీలర్ డబ్బు ఇస్తుండగా ఏసీబీ డి.ఎస్.పి రమేష్ తన బృందంతో వెళ్లి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం శబరిసను స్థానిక తహసిల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారించగా డిటి యాకూబ్ పాషా, ఆపరేటర్ విజయ్ లు డీలర్ ఇచ్చిన ఆ డబ్బు తీసుకొని తమకు ఇవ్వాలని చెప్పినట్లు శబరి అధికారులకు వివరించారు.

ఉద్యోగులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు తెలియజేయండి
-అవినీతి నిరోధక శాఖ డిఎస్పి వై. రమేష్
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే పనులు చేసేందుకు లంచం అడిగితే వెంటనే తెలియజేయాలని అవినీతి నిరోధక శాఖ డిఎస్పి వై రమేష్ తెలిపారు. అవినీతి అధికారు కబంధహస్తాల నుండి అమాయక ప్రజలను కాపాడేందుకే శాఖ ఉన్నదని, సమాచారం తెలియజేసిన వారి పేర్లను వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. నిర్భయంగా తమకు జరిగిన అన్యాయం గురించి టోల్ ఫ్రీ నెంబర్ 10 64 కు తెలియజేసినచో వారికి కొన్ని సూచనలు ఇచ్చి న్యాయం చేస్తామని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img