epaper
Thursday, January 15, 2026
epaper

20న టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా మహాసభ

20న టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా మహాసభ
జిల్లా కమిటీ, ఆహ్వానితుల సమావేశంలో నిర్ణయం
విజయవంతం చేయాల్సిందిగా జర్నలిస్టులకు పిలుపు
అక్రిడిటేషన్, ఇండ్లస్థలాల పాలసీ వెంటనే ప్రకటించాలి
మామిడి సోమయ్యకు టీడబ్ల్యూజేఎఫ్ కు సంబంధం లేదు
ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి, ఖదీర్

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా మహాసభలు ఈనెల 20వ తేదీన ఖమ్మంలో నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసరెడ్డి, స్టేట్ అడ్ హక్ కమిటీ సభ్యులు సయ్యద్ ఖదీర్ వెల్లడించారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఖమ్మంలోని మంచికంటి ఫంక్షన్ హాల్ లో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ, ఆహ్వానితుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకు చెందిన జర్నలిస్టులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు, ఆయా రంగాల ప్రముఖులు, ఫెడరేషన్ రాష్ట్ర నాయకులను ఈ మహాసభలకు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. జర్నలిస్టు మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్త అక్రిడిటేషన్ పాలసీని వెంటనే ప్రకటించి, కొత్త కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులు ఎవ్వరికీ అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ప్రత్యేక పాలసీ ద్వారా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్ పాలసీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళా జర్నలిస్టులకు రాత్రి వేళల్లో ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. వర్కింగ్ జర్నలిస్టు సంఘాలను రద్దు చేస్తూ కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్ ను రాష్ట్రంలో అమలు కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టుల గందరగోళ పరిచేలా సోమయ్య ప్రకటనలు

మామిడి సోమయ్యకు టీడబ్ల్యూజేఎఫ్ కు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ స్పష్టం చేశారు. సంఘం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన
సోమయ్య ను సంఘం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ రాష్ట్ర కార్యవర్గం, జనరల్ బాడీ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ఉనికి కోసమే ఆయన జిల్లాల్లో తిరుగుతూ జర్నలిస్టులను గందరగోళపరుస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు జక్కంపూడి కృష్ణ, కోటి శివారెడ్డి, దువ్వా సాగర్, కూరాకుల గోపీ, మానుకొండ రవికిరణ్, ఆవుల శ్రీనివాస్, షేక్ జానీపాష, కొత్త యాకేష్, మధుశ్రీ, దేవేందర్, కరుణాకర్ రెడ్డి, షకీల్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img