ముంపు బాధిత విద్యార్థులకు అండగా..తుమ్మల యుగంధర్
విద్యార్థుల కు నోట్ బుక్స్, బ్యాగులు పంపిణీ
చిన్నారులతో సహపంక్తి భోజనం
కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: ఇటీవల అకాల వర్షాల ప్రభావంతో జలగం నగర్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ముంపునకు గురై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భవనం నీటిలో మునిగిపోవడంతో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని కలిసి స్కూల్ను సురక్షిత ప్రాంతానికి మార్చమని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి పాఠశాలను అరెంపులలోని మహమ్మదీయ కాలేజీ వద్దకు తరలించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తక్షణ చర్యలు తీసుకోవడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, స్థానికుల మన్ననలు పొందింది. సందర్భంలో పాఠశాల మౌలిక సదుపాయాల మెరుగుదల అవసరాన్ని కూడా గుర్తించిన తుమ్మల యువసేన ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
వరదల కారణంగా నష్టపోయిన విద్యార్థుల కోసం తన సొంత ఖర్చుతో నోట్ బుక్స్ అందజేశారు. ఆయన ఆప్యాయతకు కృతజ్ఞతగా పాఠశాల యాజమాన్యం యుగంధర్ ని పాఠశాలకు ఆహ్వానించింది. శుక్రవారం ఆయన పాఠశాలకు వెళ్లి విద్యార్థులను స్వయంగా పలకరించారు. తుమ్మల యువసేన తరఫున 250 స్కూల్ బ్యాగ్స్ను విద్యార్థులకు అందజేశారు. ఒక్కొక్కరితో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యా ప్రమాణాల పెంపుకు సూచనలు చేశారు. పాఠశాల వాతావరణంలో ఉత్సాహం నింపుతూ యుగంధర్ గారి మాటలు పిల్లల్లో కొత్త ఆశను నింపాయి. సేవే ధర్మమని ఆయన ప్రవర్తనతో చూపించారు.మాటల్లో కాదు, మానవత్వంలో మమకారం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసిన యుగంధర్ పిల్లలకు మానవత్వ పాఠం నేర్పారు. భోజన సమయంలో పిల్లలతో ముచ్చటిస్తూ వారి కలలను తెలుసుకున్నారు. “మీరు బాగా చదివి మంచి స్థాయిలో నిలవాలి” అని ప్రోత్సాహపరిచారు.

చదువు మీకు ఆయుధం – భవిష్యత్తు మీ చేతుల్లోనే”
విద్యార్థులతో మాట్లాడుతూ యుగంధర్ “మీకు ఏం కావాలన్నా, నా సహాయం మీకు ఉంటుందని భరోసా ఇచ్చారు. “పరీక్షల్లో మంచి మార్కులు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు గౌరవం తేవాలి” అని పిలుపునిచ్చారు. ఆయన మాటలు విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపాయి. “విద్యే మన జీవితానికి పునాది, మీరు చదువులో రాణించాలని సూచించారు.



