epaper
Thursday, January 15, 2026
epaper

అర్హులందరికీ పారదర్శకంగా సదరం సర్టిఫికెట్లు

అర్హులందరికీ పారదర్శకంగా సదరం సర్టిఫికెట్లు
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో కలెక్టర్ అనుదీప్

కాకతీయ, ఖమ్మం : దివ్యాంగుల అభ్యున్నతికి పటిష్టమైన కార్యాచరణను అమలు చేస్తున్నామని ఖ‌మ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా నెలరోజులు ఆలస్యంగా దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని, అయినప్పటికీ దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాల అమలులో ఖమ్మం జిల్లా యంత్రాంగం ఎప్పుడూ ముందంజలోనే ఉంటుందని కలెక్టర్ తెలిపారు. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన దివ్యాంగ జంటలకు ఈ ప్రోత్సాహకం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్కాలర్‌షిప్‌లు, దివ్యాంగులకు అవసరమైన పరికరాల పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

సదరం సర్టిఫికెట్ల జారీపై ప్రత్యేక నిఘా

అర్హులైన దివ్యాంగులందరికీ పారదర్శకంగా సదరం సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ర్యాండమ్‌గా తనిఖీ చేసి, అర్హులకు మాత్రమే సర్టిఫికెట్లు అందుతున్నాయా లేదా అన్నది పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో కంటి చూపు సమస్య కారణంగా బిడ్డను పాఠశాలకు పంపలేకపోతున్నారని వచ్చిన దరఖాస్తును ప్రస్తావిస్తూ, ఖమ్మం జిల్లాలో కంటి చూపు సమస్య ఉన్న పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే దాన్ని ప్రారంభిస్తామని కలెక్టర్ వెల్లడించారు. వీధి వ్యాపారాల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు అయ్యేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి విజేత, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో డా. వేణుమాధవ్, డీహెచ్‌ఈడబ్ల్యూ సమ్రీన్, దివ్యాంగ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, సంబంధిత అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img