ఘనంగా తుమ్మల యుగంధర్ బర్త్ డే వేడుకలు
అభిమానంతో అనుచరుల రక్తదానం, అన్నదానం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిన్నంటిన సంబరాలు
కాకతీయ, ఖమ్మం సిటీ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, యువనేత తుమ్మల యుగంధర్ జన్మదిన వేడుకలు ఖమ్మం జిల్లావ్యాప్తంగా బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి, తండ్రి బాటలోనే ఖమ్మం అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న యుగేంద్రుడు 43వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. అన్నదాన, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసి సామాజిక బాధ్యతను ప్రదర్శించారు. తుమ్మల యుగంధర్ ముఖ్య అనుచరులైన మాజీ నగర గ్రంథాలయ చైర్మన్ మొహమ్మద్ ఆశ్రిఫ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ లతీఫ్, సమీర్, నాలం సతీష్, కుక్కల మహేష్, వాసుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ లతీఫ్ స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. నగర వ్యాప్తంగా జరిగిన వేడుకల్లో యుగంధర్ స్వయంగా పాల్గొని అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన పుట్టినరోజును గుర్తుపెట్టుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నమస్కారాలు తెలియజేశారు. అదేవిధంగా గ్రానైట్ మార్బుల్ మార్కింగ్ సంఘం ఆధ్వర్యంలో అనాథాశ్రమాల్లో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎరగర్ల హనుమంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేష్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, కాంగ్రెస్ నాయకులు మిక్కిలినేని నరేంద్ర, బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ తదితరులు పాల్గొన్నారు. యువనేత యుగంధర్ పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాల స్ఫూర్తితో జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


