epaper
Saturday, November 15, 2025
epaper

రాజ్యాంగాన్ని గౌరవించని వారు దేశద్రోహులే..

  • విశ్వాసాల ముసుగులో సీజే గవాయ్ పై దాడి దుర్మార్గం
  • ఆ ఘటనను సుమోటోగా తీసుకోకపోవడం బాధాకరం
  • నవంబర్ 1న హైదరాబాదులో భారీ నిరసన ర్యాలీ
  • ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

కాకతీయ, ఖమ్మం టౌన్: దేశ రాజ్యాంగాన్ని గౌరవించిన వారు, చట్టాలకు విలువనివ్వని వారిని దేశద్రోహులుగా పరిగణించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులపై ఇప్పటికీ వివక్ష, అంటరానితనం, దాడులు, హత్యలు, హత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. దేశ అత్యున్నత వ్యవస్థ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయ్ మీదనే బూటుతో దాడి జరిగిందని తెలిపారు. ఈ సంఘటన జరిగి మూడు వారాలు గడుస్తున్నా పోలీసులు మౌనంగా ఉండడం, న్యాయవ్యవస్థ సుమోటోగా కేసు తీసుకోకపోవడం దారుణమని అన్నారు. మానవ హక్కుల కమిషన్ స్పందించలేదన్నారు. అంటే ఈ దేశంలో దళితులకు ఇప్పటికీ రక్షణ లేదని స్పష్టంగా రుజువు అవుతుందన్నారు.

ధర్మం, విశ్వాసాల ముసుగులో రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా, చట్టాలకు విలువనివ్వకుండా దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని గౌరవించని వారు, చట్టాలకు విలువనివ్వని వారు దేశద్రోహులవుతారని స్పష్టం చేశారు. గవాయ్ స్థానంలో వేరే జస్టిస్ ఉంటే దాడి జరిగేదా అని ప్రశ్నించారు.? గతంలో జార్ఖండ్ లో న్యాయమూర్తిని అవమానించాడని ఐదుగురు జడ్జీల బృందం అర్ధగంటలో న్యాయవాదిపై కేసు నమోదు చేశారని గుర్తుచేశారు. అలాగే పోలీసు కస్టడీలో ఉన్న రౌడీషీటర్ రియాజ్ ఎలా చనిపోతాడని మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసిందని గుర్తు చేశారు. చీఫ్ జస్టిస్ మీద సుప్రీంకోర్టులో దాడి జరిగితే సుమోటోగా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. గవాయిపై జరిగిన దాడిని, దళితులందరిపై జరిగిన దాడిగా పరిగణిస్తూ.. దళితుల ఆత్మగౌరాన్ని కాపాడుకోవడానికి, న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి, రాజ్యాంగ పరిరక్షణకు నవంబర్ 1న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాదులో నిరసన ర్యాలీ జరుగుతుందని తెలిపారు. కుల, మత, రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు కదలి రావాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో ఖమ్మం జిల్లా ఇంచార్జి కందికట్ల విజయ్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూరుగంటి అంజయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు చిలక నాగరాజు, గొల్లమందల ముత్తారావు, తోళ్ళ సురేష్, తూరుగంటి రాము, బాకి శ్రీను, కనకం జనార్ధన్, చింతిరాల నాగభూషణం, కొలికపోగు ప్రభు, సూరేపల్లి నాగేశ్వరరావు, తోళ్ళ వెంకన్న, పొట్టపింజర బాలస్వామి, పార్షపు ఇనుక, పగిడిపల్లి రవీందర్, మాదాసు వెంకన్న, లంజపల్లి భద్రం, పడిశాల నాగేశ్వరరావు, కుక్కల లక్ష్మయ్య, చిర్రా ఉపేందర్, స్వామి, చాగంటి నరసింహారావు, రాజు, నాగేశ్వర్రావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..?? ద‌ర్యాప్తు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు..? ర‌క్త‌చ‌రిత్ర‌లో రాజ‌కీయ కోణంపై...

ఎన్ డి ఎ కూటమి విజయం

ఎన్ డి ఎ కూటమి విజయం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మండల...

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ ప్రజల...

భళారే.. యమ

భళారే.. యమ పిల్లల పండుగ రోజున అలరించిన బుడతడు కాకతీయ కొత్తగూడెం రూరల్: బాలల...

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట…

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట... రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, చేనేత...

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ నాయకుడు,...

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డాక్టర్ దుర్గాభవాని కాకతీయ, పినపాక:...

సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది…

సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది... పిల్లలను స్వేచ్ఛగా వివక్షతరహితంగా పెంచాలి... స్మార్ట్ కిడ్జ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img