epaper
Monday, March 2, 2026
epaper

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
ఏప్రిల్ నుంచి మరో విడత ఇందిరమ్మ ఇళ్లు
ఏడాదిలో ఏదులాపురంను మోడల్ మున్సిపాలిటీగా మారుస్తాం
: మంత్రి పొంగులేటి

కాకతీయ, ఖమ్మం/ఏదులాపురం : పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులతో పాటు కమ్యూనిటీ హాల్ ఆధునీకరణ, బస్ షెల్టర్, జంక్షన్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. బారుగూడెంలో రూ.24.27 లక్షలు, గొల్లగూడెంలో రూ.37.20 లక్షలు, నాయుడుపేటలో రూ.44.50 లక్షలు, నడిమితండలో రూ.77.10 లక్షలు, జలగం నగర్‌లో రూ.29.30 లక్షలు, ఆటోనగర్‌లో రూ.17.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైన్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

రూపు మారుతున్న మున్సిపాలిటీ

నాయుడుపేటలో రూ.26.30 లక్షలతో చేపట్టిన కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ పనులు, మహబూబాబాద్ క్రాస్‌రోడ్ జంక్షన్ వద్ద రూ.7.40 లక్షలతో బస్ షెల్టర్ నిర్మాణం, రూ.24.30 లక్షలతో జంక్షన్ అభివృద్ధి పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఏదులాపురం మున్సిపాలిటీ 19వ వార్డు గొల్లగూడెంలో రూ.42.26 కోట్లతో 14 అభివృద్ధి పనులు, పెద్దతండ గ్రామపంచాయతీలో సుమారు రూ.14 కోట్లతో పనులు చేపట్టామని మంత్రి తెలిపారు. గత పాలకుల హయాంలో మౌళిక వసతుల కల్పనను నిర్లక్ష్యం చేశారని విమర్శించిన మంత్రి, రాబోయే ఏడాది కాలంలో ఏదులాపురం మున్సిపాలిటిని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మున్నేరు వరదలతో ఇబ్బంది పడ్డ ప్రజలను దృష్టిలో పెట్టుకొని వర్షాకాలం నాటికి మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

పేదలకే ప్రాధాన్యం.. సంక్షేమమే దిక్సూచి

ఆటోనగర్ ప్రాంతంలో రెండు దశాబ్దాలుగా మౌళిక వసతుల లేమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్న మంత్రి, వారం రోజుల్లో మరో రెండు రోడ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యే బాధ్యతను తానే తీసుకుంటానని స్పష్టం చేశారు. పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డుల పంపిణీ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన చేయలేదని విమర్శించిన మంత్రి, ఇందిరమ్మ ప్రభుత్వం తొలి విడతలోనే 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. రాబోయే మూడు విడతల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, లబ్ధిదారులకు ప్రతి సోమవారం ఇంటి నిర్మాణ పురోగతిని బట్టి నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నచోట పారదర్శకంగా పంపిణీ చేస్తామని, ఏప్రిల్ నుంచి మరో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకోబు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఖమ్మం రూరల్ తహసిల్దార్ రాంప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img