epaper
Monday, March 2, 2026
epaper

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం ఎజెండా

  • రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
  • గత 21 నెలల్లో రూ.12. 47 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం
  • రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

కాకతీయ, ఖమ్మం రూరల్ : పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ప్రభుత్వ పాలన సాగిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఏదులాపురం మున్సిపాలిటీలోని చిన్న వెంకటగిరి ప్రాంతంలో ఖమ్మం, కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు నుంచి జి ప్లస్2 కాలనీ వరకు ప్రతిపాదించిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఖమ్మం, కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు నుంచి జిప్లస్2 కాలనీ వయా ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 వరకు బీటీ రోడ్డును కోటి 71 లక్షలతో శంకుస్థాపన చేసుకున్నామని చెప్పారు.

ఇందిరమ్మ ప్రభుత్వం హయాంలో ఏదులాపురం మున్సిపాలిటీ  పరిధిలో కోటి 53 లక్షలతో అంతర్గత సిసి రోడ్లు, రూ.2 కోట్ల 65 లక్షలతో మినీ స్టేడియం నిర్మిస్తున్నామని, మంచినీటి సరఫరా కోసం సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. వెంకటగిరి ఆర్ అండ్ బి రోడ్డు నుండి ఖమ్మం కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు వయా జంగాల కాలనీ వరకు కోటి 32 లక్షలతో, ప్రకాష్ నగర్ బ్రిడ్జి నుంచి ఖమ్మం కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు వయా కోట నారాయణపురం ఇందిరమ్మ కాలనీ వరకు 2 కోట్ల 50 లక్షల రూపాయలతో, వెంకటగిరి ఎస్సీ, బిసి కాలనీ నుండి గుదిమల్ల వరకు 2 కోట్ల 4 లక్షలతో మంజూరు చేసామని, వీటికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని అన్నారు. గడిచిన 21 నెలల్లో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో రూ.12.47 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు.

పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు డైట్ చార్జీలు 40 శాతం, పిల్లలకు కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచామన్నారు. అర్హులైన పేదలందరికీ మరో మూడు విడతలలో రాజకీయాలకతీతంగా సొంత ఇండ్లు ఉండే విధంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ..  కోటి 71 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేసుకుంటున్నామని, దీని వల్ల ఇందిరమ్మ కాలనీలోని వందలాది కుటుంబాలకు ఖమ్మం, కోదాడ రోడ్డు కనెక్టివిటీ వస్తుందని అన్నారు. మంత్రి సహకారంతో ఏదులాపురం మున్సిపాలిటీలో అదనపు నిధులు మంజూరు చేసుకుంటూ కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలో అదనపు సౌకర్యాలైన డ్రైయిన్, త్రాగునీరు, అంతర్గత రోడ్ల కల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమ అనంతరం అక్కడే గతంలో చేపట్టి, నిర్మాణం పూర్తి కాని ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఏదులాపురం మునిసిపల్ కమిషనర్ ఏ. శ్రీనివాస రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img