epaper
Sunday, March 1, 2026
epaper

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా !
ఆదాయంలో బీఎంసీ రికార్డు..!
మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక దృష్టి

ముంబై : మహారాష్ట్రలో జనవరి 15న జరగనున్న మున్సిపల్ మేయర్ ఎన్నికల్లో 29 కార్పొరేషన్లు కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోనున్నాయి. ఈ ఎన్నికల్లో దేశంలోనే అత్యంత ధనవంతమైన మున్సిపల్ సంస్థగా పేరుగాంచిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)పై ప్రత్యేక దృష్టి కేంద్రీకృతమైంది. కోట్ల రూపాయల బడ్జెట్‌, విస్తృత ఆదాయ వనరులు, భారీ వ్యయాలతో బీఎంసీ దేశంలోని ఇతర మహానగర కార్పొరేషన్లకు భిన్నంగా నిలుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి బీఎంసీ బడ్జెట్‌ అంచనా రూ.59,954.7 కోట్లుగా ఉంది. ఇది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ (రూ.16,683 కోట్లు), బెంగళూరు బీబీఎంపీ (రూ.12,369 కోట్లు) బడ్జెట్లను కలిపినా రెట్టింపు కావడం విశేషం. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌ బడ్జెట్‌ మాత్రం రూ.5,166.5 కోట్లకే పరిమితమైంది. గత పదేళ్లలో బీఎంసీ బడ్జెట్‌ దాదాపు రెట్టింపు అయ్యింది. 2015–16లో రూ.20,500 కోట్లుగా ఉన్న వ్యయం 2024–25 నాటికి రూ.44,500 కోట్లకు చేరింది.

ఆదాయంలోనూ దూసుకుపోతున్న బీఎంసీ

2024–25లో బీఎంసీ మొత్తం ఆదాయం రూ.81,774 కోట్లుగా అంచనా వేశారు. ఫీజులు, యూజర్‌ ఛార్జీలు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. సేవలు, లైసెన్సులు, రిజిస్ట్రేషన్‌, ప్రకటనలు, నీటి కనెక్షన్లు వంటి వాటి ద్వారా 2016 నుంచి 2025 మధ్య రూ.94,600 కోట్లు వసూలయ్యాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు, సబ్సిడీల రూపంలో రూ.86,700 కోట్లు లభించాయి. ఇతర ప్రభుత్వ సంస్థల తరఫున సేవలు అందించినందుకు కూడా బీఎంసీ భారీ మొత్తాలు వసూలు చేసింది. 2023–24లో బాంద్రా–కుర్లా రోడ్ల శుభ్రతకు ఎంఎంఆర్‌డీఏ నుంచి రూ.61.7 కోట్లు వసూలు చేయడం అందుకు ఉదాహరణ.

పన్నుల వసూళ్లతో భారీ లాభం
విద్యుత్‌, ప్రాపర్టీ, నీటి, థియేటర్‌, వీధి పన్నుల రూపంలో 2016–25 మధ్య రూ.75,800 కోట్లు బీఎంసీ ఖజానాకు చేరాయి. స్థిర నిధులు, వాటిపై వడ్డీ కూడా వార్షిక ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.గత పదేళ్లలో నగర అభివృద్ధి, మౌలిక వసతులపై బీఎంసీ రూ.1,11,600 కోట్లు ఖర్చు చేసింది. రోడ్లు, వంతెనలు, మురుగునీటి వ్యవస్థ, ప్రజారోగ్యం, విద్య, భద్రత, ఉద్యోగుల జీతాలు–పింఛన్లు ప్రధాన వ్యయాంశాలుగా ఉన్నాయి. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, గ్రంథాలయాలకు గ్రాంట్లుగా రూ.10,700 కోట్లు వెచ్చించింది. ప్రజా మౌలిక సదుపాయాల నిర్వహణకు రూ.36,300 కోట్లు ఖర్చు చేసింది.
2024–25లో మాత్రమే దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు రూ.99.5 కోట్లు, ఎలుకల నియంత్రణకు రూ.12.8 కోట్లు వెచ్చించడం గమనార్హం. దేశంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో పోలిస్తే బీఎంసీ ఆర్థిక శక్తి, వ్యయ సామర్థ్యం అసమానంగా ఉండటంతో, రాబోయే మేయర్ ఎన్నికలు రాజకీయంగా మాత్రమే కాక ఆర్థికంగా కూడా ఎంతో కీలకంగా మారాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img