epaper
Thursday, January 15, 2026
epaper

చిక్కినవి చిన్న చేపలే… తిమింగలం ఎక్కడ?

చిక్కినవి చిన్న చేపలే… తిమింగలం ఎక్కడ?
ఏసీబీ దాడులతో ఉలిక్కిపడ్డ అటవీ అధికారులు
అసలు దోషులు తప్పించుకుంటున్నారా?
‘టన్నుల లెక్క‌న‌’ లంచం డిమాండ్‌
భ‌ద్రాద్రి జిల్లా అట‌వీశాఖ‌లో అక్ర‌మార్కులు
ఏసీబీ దాడుల‌తో మ‌రికొంత‌మంది అధికారుల‌పై చ‌ర్చ‌

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కాసులకు కక్కుర్తి పడి అటవీ శాఖ అధికారులు ఏసీబీకి అడ్డంగా దొరికిన ఘటనతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. కంచె చేను మేసిందా అన్న చందంగా ఉన్న ఈ వ్యవహారంలో, సోర చేపను వదిలేసి చిన్న చేపలకే ఏసీబీ వల పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డామిట్ కథ అడ్డం తిరుగుతుందో ఏమో కానీ, అసలు దోషులు పక్కకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోందన్న చర్చ జోరుగా సాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖను డివిజన్ల వారీగా మూడు జోన్లుగా విభజించారు. కొత్తగూడెం జోన్–1, జోన్–2, అన్నపురెడ్డిపల్లి జోన్–3గా విభజన జరిగింది. కొత్తగూడెం జోన్–1 పరిధిలో సుమారు 5,500 ఎకరాల్లో జామాయిల్ తోటలు ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి, చాతకొండ, గరిమెళ్లపాడు, పెనుబల్లి, రామవరం, శ్రావణ్ షాట్, గరిపేట, పెనగడప, తిప్పనపల్లి, సీతాయిగూడెం, జూలూరుపాడు మండలంలోని సూరారం సహా మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఈ తోటలు విస్తరించి ఉన్నాయి. వీటికి డివిజనల్ ప్లాంటేషన్ మేనేజర్‌గా తాడి రాజేందర్ పని చేస్తున్నారు.

‘టన్నుకు’ లంచం
2002–03 సంవత్సరానికి సంబంధించి సుమారు 3,900 ఎకరాల్లో జామాయిల్ కటింగ్కు టెండర్లు పిలిచారు. కొత్తగూడెం ప్రాంతంలో ఎనిమిది యూనిట్లకు గాను జామాయిల్ కటింగ్, రవాణా పనులకు మొత్తం రూ.2.90 కోట్లకు ఒంగోలు ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నట్లు సమాచారం. అయితే టెండర్ పొందిన కాంట్రాక్టర్ నుంచి టన్నుకు రూ.150 లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పనుల్లో అనేక ఆంక్షలు, అడ్డంకులు పెట్టడంతో చివరికి టన్నుకు రూ.90కి బేరం కుదిరినట్లు తెలుస్తోంది. తొలి విడతగా రూ.3.50 లక్షలు ఇవ్వాలని ఒప్పందం కుదరగా, ఆ నగదును ఒక వ్యక్తి ద్వారా సీతాయిగూడెంకు పంపించారు.

నగదు ఎవరికివ్వాలో తెలియక… ఏసీబీకి సమాచారం

నగదు తీసుకొచ్చిన వ్యక్తికి ఎవరికి ఇవ్వాలో స్పష్టత లేకపోవడంతో, సీతాయిగూడెంలో కాంట్రాక్టర్ వద్ద సూపర్వైజర్‌గా పని చేస్తున్న గోపాలకృష్ణకు అప్పగించినట్లు సమాచారం. ఈలోగా ముందస్తు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు గోపాలకృష్ణ వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో జరిగిన మొత్తం వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్లాంటేషన్ మేనేజర్ తాడి రాజేందర్, సూపర్వైజర్ గోపాలకృష్ణను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

చిన్న చేపలే పట్టుబడ్డాయి… తిమింగలం సంగతేంటి?

ఏసీబీ దాడుల్లో ప్లాంటేషన్ మేనేజర్, సూపర్వైజర్‌లను మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారానికి ప్రధాన కారణమని చెప్పబడుతున్న డివిజనల్ మేనేజర్ శ్రీవాణిని ఇప్పటివరకు రిమాండ్ చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు కీలక పాత్రధారులు తప్పించుకుంటున్నారా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ సీతాయిగూడెం ప్రాంతానికి చెందిన సూపర్వైజర్ గోపాలకృష్ణ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సీతాయిగూడెం పంచాయతీ నాలుగో వార్డు మెంబర్‌గా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఒక్క ఓటుతో గెలుపొందారు. గెలుపు సంబరాలు ముగియకముందే ఏసీబీ వలకు చిక్కుకోవడంతో స్థానిక ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. ఈ కేసులో నిజంగా తిమింగలాలు బయటపడతాయా? లేక కథ ఇక్కడితో ముగుస్తుందా? అన్నది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img