epaper
Saturday, November 15, 2025
epaper

త‌ల‌, మొండెం వేరుచేసి … శ‌రీర భాగాలు ముక్క‌లు చేసి

  • స్నేహం ముసుగులో వ్య‌క్తి దారుణ హ‌త్య‌
  • డ‌బ్బు, న‌గ‌ల కోసం కిరాత‌కం
  • యూట్యూబ్‌లో సెర్చ్‌చేసి ఫ్రెండ్ మ‌ర్డ‌ర్‌కు ప్లాన్‌
  • ఖ‌మ్మం హ‌త్య కేసులో వెలుగులోకి సంచ‌ల‌నాలు..
  • వివ‌రాలు వెల్ల‌డించిన ఏసీపీ తిరుప‌తిరెడ్డి

కాకతీయ, ఖమ్మం రూరల్: స్నేహం మూసుగులో ఓ వ్యక్తిని అత్యంత పాశవికంగా హతమార్చిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి బుధవారం తన కార్యాలయంలో హత్యకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన పరిమి అశోక్ ఎం ఫార్మసీ వరకు చదువుకున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో తన స్వగ్రామమైన చిట్యాలలో వంగ తోట సాగు చేయడానికి కొంతమంది వద్ద అప్పు తీసుకున్నారు. పంట నష్టం రావడంతో ఖమ్మంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తున్న తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన కొమ్ము నగ్మాతో పరిచయమై అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

ముళ్ల పొద‌ల్లో శ‌రీర భాగాలు..

కామేపల్లి మండలం కెప్టెన్ బంజార‌కు చెందిన స్నేహితుడు గట్ల వెంకటేశ్వర్లు అశోక్‌కు అప్పుడప్పుడు అవసరాలకు డబ్బులు ఇచ్చేవాడు. అశోక్, వెంకటేశ్వర్లు మధ్య స్వలింగ సంపర్క బంధం ఏర్పడింది. ఈక్ర‌మంలోనే వెంకటేశ్వర్లు వ‌ద్ద ఉన్న బంగారం, డబ్బుల‌పై అశోక్ క‌న్నుప‌డింది. ఎలాగైనా కాజేయాల‌ని ప‌థ‌కం ప‌న్ని వెంక‌టేశ్వ‌ర్లు మ‌ర్డ‌ర్‌కు ప్లాన్ చేశాడు. ఇందుకోసం యూట్యూబ్లో సెర్చ్ చేసి హ‌త్య గురించి తెలుసుకున్నాడు. మ‌ర్డ‌ర్ కోసం గత నెల 15న కత్తులు తెచ్చి పెట్టుకున్నాడు. అదే రోజు వెంక‌టేశ్వ‌ర్లు రాత్రి 8:30 గంట‌ల‌కు అశోక్ రూంకి వచ్చి పడుకున్నాడు.

16న‌ తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో బయట కాపలా గా నగ్మాను ఉంచి కత్తితో వెంక‌టేశ్వ‌ర్లు మెడపై అనేక సార్లు నరకడంతోపాటు మొండెం, తలకాయ వేరు చేసి శరీరంలోని భాగాలను ముక్కలుగా చేసి కవర్ల‌లో పెట్టి దుప్పట్లో చుట్టి బండిపై వచ్చి ఖమ్మంలోని కరుణగిరి స‌మీపంలో ముళ్ళ పొదలో వేశాడు. త‌ర్వాత తన రూంలోని రక్తపు మరకలను శుభ్రం చేశాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏసీపీ తెలిపారు. కేసులో ప్రతిభ కనబరిచిన సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి, కామేపల్లి ఎస్సై సాయికుమార్, కారేపల్లి ఎస్సై గోపి, కానిస్టేబుల్స్ అంజి, ఆనంద్, సంపత్, రాజేష్ ను ఏసీపీ తిరుపతిరెడ్డి అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..?? ద‌ర్యాప్తు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు..? ర‌క్త‌చ‌రిత్ర‌లో రాజ‌కీయ కోణంపై...

ఎన్ డి ఎ కూటమి విజయం

ఎన్ డి ఎ కూటమి విజయం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మండల...

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ ప్రజల...

భళారే.. యమ

భళారే.. యమ పిల్లల పండుగ రోజున అలరించిన బుడతడు కాకతీయ కొత్తగూడెం రూరల్: బాలల...

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట…

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట... రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, చేనేత...

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ నాయకుడు,...

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డాక్టర్ దుర్గాభవాని కాకతీయ, పినపాక:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img