epaper
Thursday, January 15, 2026
epaper

252 జీవోను ప్ర‌భుత్వం స‌వ‌రించాలి

252 జీవోను ప్ర‌భుత్వం స‌వ‌రించాలి
జ‌ర్న‌లిస్టుల‌ అక్రిడేషన్ కార్డుల కోతను మానుకోవాలి
భ‌ద్రాద్రి క‌లెక్ట‌రేట్ ఎదుట జ‌ర్న‌లిస్టుల ధ‌ర్నా

కాకతీయ, కొత్తగూడెం : జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ప్రజాపాలన పేరుతో పాత్రికేయులను శిక్షించే ధోరణి అవలంబిస్తోందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యూజే–టీజేఎఫ్ హెచ్143) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని, జర్నలిస్టులను విభజించేలా ఉన్న 252 జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కల్లోజీ శ్రీనివాస్, కార్యదర్శి మహమ్మద్ షఫీ, రాష్ట్ర కమిటీ సభ్యులు గుర్రం రాజేష్, చండ్ర నరసింహారావు, వట్టి కొండ రవి మాట్లాడుతూ… “జర్నలిస్టులపై ఎందుకీ కక్ష? ప్రజా పాలన పేరుతో మాకెందుకు శిక్ష?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అక్రిడేషన్ కార్డుల జారీలో కోత పెట్టడం ద్వారా ప్రభుత్వానికి మిగిలే కోట్లెన్ని అని ప్రశ్నించారు.

252 జీవోతో జర్నలిస్టులకు అన్యాయం

ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రిడేషన్ జీవో జర్నలిస్టుల మధ్య చీలిక తెచ్చేలా ఉందని నాయకులు విమర్శించారు. రెండు కార్డుల విధానానికి స్వస్తి పలకాలని, వర్కింగ్ జర్నలిస్టులందరికీ సమాన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన జర్నలిస్టుల గుర్తింపును రద్దు చేయడం అన్యాయమన్నారు. ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు వంటి సంక్షేమ పథకాలు కూడా జర్నలిస్టులకు అమలు చేయాలని కోరారు. 252 జీవో సవరించి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు.

అల్లం నారాయణ హయాంలో జర్నలిస్టులకు భరోసా

గత ప్రభుత్వ హయాంలో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ ఉన్న సమయంలో జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు సంపూర్ణ న్యాయం జరిగిందని యూనియన్ నాయకులు గుర్తుచేశారు. కరోనా సమయంలో బాధిత జర్నలిస్టులకు ఆర్థిక సాయం, మృతి చెందిన జర్నలిస్టుల పిల్లల చదువులకు సహకారం అందించారని తెలిపారు. తెలంగాణలో అత్యధిక సంఖ్యలో అక్రిడేషన్ కార్డులు జారీ చేయించిన ఘనత అల్లం నారాయణదేనని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img