epaper
Monday, March 2, 2026
epaper

3 నెలల్లో ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

  • కమీషన్ల కోసం పనిచేసే మంత్రులను బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి
  • గెలిచివస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పి రాజగోపాల్ రెడ్డిని మోసం చేశారు
  • ఆర్ ఎల్ డీ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్

కాకతీయ, ఖమ్మం టౌన్ : కమీషన్ల కోసమే పనిచేసే మంత్రులను బర్తరఫ్ చేయాలని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రథయాత్ర సోమవారం ఖమ్మంకు చేరుకుంది. ఈ సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయని వారు నేడు మంత్రులుగా కమీషన్ల కోసమే పని చేస్తున్నారని వారిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికై 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలన్నారు. ప్రైవేటు పరిశ్రమల్లో స్థానికులకు 95శాతం ఉద్యోగాలు కల్పించేలా చట్టం చేయాలన్నారు.

విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థల్లో 25శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలన్నారు. రాజీవ్ యువవికాసం పేరిట 5 లక్షల మంది నిరుద్యోగులకు వ్యక్తిగత రుణాలు ఇస్తామని చెప్పిన వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు. అంబేద్కర్ అభయహస్తం పేరిట దళితులకు 12 లక్షల ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు తులం బంగారం, గృహలక్ష్మీ పథకం క్రింద రూ. 2500లు చెల్లించాలన్నారు. అదేవిధంగా విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ లో గెలిచి వస్తే మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారని, మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతుందని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రథయాత్ర ఖమ్మం చేరుకుందని, మిగతా జిల్లాల్లో కూడా ఈ యాత్ర కొనసాగుతుందని తెలియజేశారు. పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జాబ్ మేళ నిర్వహిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధికార ప్రతినిధి గౌర బీరప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షులు మోత్కూరి వెంకటాచారి, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ గంట్యాల నరసింహారావు, కార్యదర్శి నూనె భాస్కరరావు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్.కె జానీ మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img