epaper
Monday, March 2, 2026
epaper

విత్తన చట్టం’లోపాలు సరిచేయాలి

విత్తన చట్టం’లోపాలు సరిచేయాలి
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సెక్రటేరియట్ లో తెలంగాణ విత్తన ముసాయిదా చట్టం-2025పై డ్రాఫ్ట్ కమిటీ సభ్యులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సమావేశం అయ్యారు. డ్రాఫ్ట్ కమిటీ ప్రతిపాదించిన ముసాయిదా చట్టం విధివిధానాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయంలో విత్తనం అనేది ప్రాథమిక అవసరం అని, వ్యవసాయం ఉద్యానవనంలో నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రావడం వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారని తెలిపారు. విత్తన చట్టం 1966, విత్తన నియంత్రణ ఉత్తర్వు 1983 అమలులో పలు లోపాలు ఉండటంతో విత్తన సంస్థలు చట్టంలోని బలహీనతను దుర్వినియోగం చేస్తున్నాయని పేర్కొన్నారు. దానిని అధిగమించేందుకు వీలుగా డ్రాఫ్ట్ కమిటీ వేసిన సందర్భాన్ని గుర్తు చేశారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా డ్రాఫ్ట్ కమిటీ సభ్యులు ప్రతిస్పందిస్తూ ప్రస్తుత విత్తన చట్టాల వివరాలు, వాటిలో ఉన్న లోపాలు, తద్వారా రైతులు ఏవిధంగా నష్టపోతున్నారు అనే వివరాలు తెలియజేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న విత్తన చట్టం, 1966 ముసాయిదా తెలంగాణలో విత్తన ఉత్పత్తికి సంబంధించి తయారు చేయడం జరిగిందని అన్నారు.

ఇందులో ప్రధానంగా విత్తన రైతుల హక్కులు, సంక్షేమం కాపాడడం, రైతు-కంపెనీ ఒప్పందాల్లో న్యాయం, నాసిరకం విత్తనాల వల్ల నష్టం కలిగిన రైతులకు పరిహారం చెల్లించే విధంగా చట్టం చేశారన్నారు. అదేవిధంగా పారదర్శకత, బాధ్యత, నియంత్రణలను బలోపేతం చేయడం, సాంప్రదాయ విత్తనాల పరిరక్షణ, నిల్వ ప్రోత్సాహం వంటి అంశాలను చేర్చిరని వివరించారు. చట్టంలో మొత్తం 8 అధ్యాయాలు, 32 సెక్షన్లు పొందుపర్చినట్లు తెలియజేశారు. విత్తనోత్పత్తికి సంబంధించి ఒక సంస్థాగత వ్యవస్థ ఏర్పాటు చేయడం, విత్తన ఉత్పత్తి నియంత్రణ, పర్యవేక్షణ , వివాద పరిష్కారాలు ఇందులో పొందుపరచారని తెలిపారు. అంతేగాక విత్తన రైతుల సంక్షేమం కోసం విత్తన రైతులకు క్రెడిట్ పెంచి ఇవ్వడం, విత్తనోత్పత్తిపై సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు రూపొందించడం, సీడ్ కో ఆపరేటివ్ లు కమ్యూటీ సీడ్ బ్యాంకులకు ఆర్థిక సహాయం లాంటి విషయాలు కూడా పొందుపర్చారని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంచాలకుడు డాక్టర్ బి. గోపి, సీడ్ కార్పొరేషన్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, అడ్వకేట్ సునీల్ కుమార్, సీడ్ డైరెక్టర్ ఎం.వి. నగేష్ కుమార్, ఈడీ రామాంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, పాలసీ నిపుణులు డి. నరసింహారెడ్డి, కె. శివ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img