epaper
Monday, March 2, 2026
epaper

కార్యాలయాల ముఖచిత్రం మారాలి!

కార్యాలయాల ముఖచిత్రం మారాలి!
ఉద్యోగులకు మెరుగైన వసతులు తప్పనిసరి
ప్రభుత్వ భవనాల మరమ్మతుల‌పై ప్ర‌తిపాద‌న‌లు పంపండి
పర్యాటకుల కోసం హరిత హోటల్‌కు స్థలాన్ని సేక‌రించాలి
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి .. జిల్లా కేంద్రంలో క్షేత్రస్థాయి తనిఖీలు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ప్రజాసేవల నాణ్యత పెరగాలంటే ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు అనుకూల వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. కార్యాలయ భవనాల మరమ్మత్తులు, మౌళిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. బస్‌డిపో రోడ్‌లోని డీఆర్డీఎ భవనం, ఆర్ & బీ ఇంజనీరింగ్ కార్యాలయం, బాల రక్షా భవనం, గిరిజన భవనం, ఆర్ & బీ గెస్ట్ హౌజ్‌తో పాటు ఇతర శాఖల కార్యాలయాల పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఉద్యోగులతో నేరుగా సంభాషణ

కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందితో నేరుగా మాట్లాడిన కలెక్టర్, మౌళిక వసతులు, పని వాతావరణం, ఎదురవుతున్న ఇబ్బందులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవనాల స్థితిగతులు, మరమ్మత్తుల అవసరం, విద్యుత్, నీటి సౌకర్యాలు, పారిశుద్ధ్యం, ఫర్నిచర్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ఉద్యోగులకు తగిన మౌళిక సదుపాయాలు కల్పించాల్సిందేనని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయ భవనాల మరమ్మత్తులు, అవసరమైన వసతుల కల్పనపై శాఖల వారీగా సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి తక్షణమే సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

గిరిజన భవనం, గెస్ట్ హౌజ్‌ల అభివృద్ధి

గిరిజన భవనం, ఆర్ & బీ గెస్ట్ హౌజ్‌ల ప్రస్తుత పరిస్థితులను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టి భవనాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఉద్యోగులకు అనుకూలమైన కార్యాలయ వాతావరణమే సమర్థవంతమైన పాలనకు ఆధారమని తెలిపారు. అనంతరం జిల్లాకు వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం నిర్మించనున్న హరిత హోటల్‌కు అనువైన స్థలం గుర్తించే దిశగా కలెక్టర్ చర్యలు చేపట్టారు. ఖమ్మం కేంద్రంలోని ఎన్ఎస్పీ క్యాంప్‌తో పాటు పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వ స్థలాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, సర్వేయర్లు నాగేశ్వరరావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img