కాకతీయ, తెలంగాణ బ్యూరో: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోసా అంత్యక్రియలు గురువారం జరిగాయి. ఉదయం మ్రుతదేహం ఇంటికి చేరుకుంది. కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు. కడారి సత్యనారాయణ రెడ్డి డెడ్ బాడీ ఇంటికి చేరుకోవడంతో గ్రామస్తులు, ప్రజా సంఘాల నేతలు, అభిమానులు పలువురు సానుభూతిపరులు గోపాలరావు పల్లెకు చేరుకుని ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రజాసంఘాల నేతలు లాల్ సలాం అంటూ నినాదాలు చేశారు. జోరువానలోనే అంత్యక్రియలను నిర్వహించారు. కడారి సత్యనారాయణ రెడ్డి క్లాస్ మెట్ అయిన మాజీ ఎమ్మెల్సీ దేవి ప్రసాద్ గోపాలరావు పల్లెకు చేరుకుని ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, పలువురు ప్రజా సంఘాల నేతలు, పలు పార్టీల నేతలు హాజరయ్యారు. 45ఏళ్లుగా ఊరికి కుటుంబానికి దూరంగా ఉన్న సత్యరానాయణ రెడ్డి, ఎన్ కౌంటర్ లో మరణించి..చివరి మజిలికి గ్రామానికి చేరుకోడంతో గ్రామస్తులంతా కన్నీటి వీడ్కోలు పలికారు.


