రజకుల పై దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలి
రజక విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలేటి రమేష్.
కాకతీయ, చేర్యాల : నాగర్ కర్నూల్ జిల్లా, కుమ్మేర గ్రామంలో మూడు రోజుల క్రితం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా, రజక కుటుంబం కుటుంబం ,స్వామివారి దర్శనం కోసం టికెట్టు లేకుండా గుడిలోకి ప్రవేశించారని,గ్రామ సర్పంచి అగ్రకుల పెత్తందారులు,రజకులను దుర్భాషలాడుతూ, విచక్షణ రహితంగా రజకులపై దాడి చేసి, అసభ్య పదజాలం తో దూషించడం, రెండు నెలలు నిండిన పసిపాపన్ని నిర్దాక్షణంగా, కిరాతకంగా తన్ని, పాపని చంపడం దురహంకారం.అగ్రకుల పెత్తందారులు ప్రజా ప్రతినిధి అనే వ్యామోహంలో అత్యంత వెనుకబడిన బిడ్డలపైన దాడులు చేస్తూ, పసిబిడ్డల ప్రాణాలు తీయడం దురహంకరాని రజక విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలేటి రమేష్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ. పసిబిడ్డ చావుకు కారణమైన అగ్రకుల పెత్తందారుల పైన హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బాధితులకు భద్రత కల్పించి నష్టపరిహారంతో పాటు వారికి వైద్యానికి అయ్యే ఖర్చు నిందితులు భరించాలని,ప్రజా పాలన అని చెప్పే ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో అత్యంత వెనుకబడిన రజక బిడ్డలపై అరాచకంగా దాడులు చేస్తూ, పసిబిడ్డల ప్రాణాలు తీస్తున్న పాలకులకు కనబడటం లేద అని మాడిపడ్డారు.నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు.


