epaper
Sunday, March 1, 2026
epaper

సత్తుపల్లి సమగ్ర అభివృద్ధికి చర్యలు

సత్తుపల్లి సమగ్ర అభివృద్ధికి చర్యలు
వనసంప‌దను ప్రతి ఒక్కరూ కాపాడాలి
సింగరేణి ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి డీఎంఎఫ్‌టీ నిధులు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
నీలాద్రి అర్బన్ పార్కులో అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వం

కాక‌తీయ‌, ఖ‌మ్మం ప్ర‌తినిధి : సత్తుపల్లి సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. గురువారం ఖ‌మ్మం జిల్లా సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన చైన్ లింక్ ఫెన్సింగ్, ఎకోప్రెండ్లీ సఫారీ వెహికల్ ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయనంద్, సిసిఎఫ్ భీమా నాయక్, జిల్లా అటవీశాఖ అధికారి సిద్దార్థ్ విక్రం సింగ్‌లోత కలిసి ప్రారంభించారు. బ్యాటరీ అపరేటెడ్ వెహికల్ లో కలెక్టర్ ను ప్రక్కన కూర్చోపెట్టుకొని మంత్రి డైవింగ్ చేస్తూ పార్క్ మొత్తం వీక్షించారు. తర్వాత సత్తుపల్లి ఖమ్మం ప్రధాన రోడ్డులోని అటవీశాఖ డివిజన్ కార్యాలయం నందు అటవీ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగూచ్ఛం ఉంచి నివాళులు అర్పించి మొక్కను నాటారు. పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పోడియంను ప్రారంభించారు. అనంతరం అటవీశాఖ సత్తుపల్లి కార్యాలయంలో నూతనంగా నిర్మించిన మీటింగ్ హాల్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అడవుల సంరక్షణ పర్యవేక్షణ కోసం అటవీ సిబ్బందికి రక్షణ పరికరాలు, మొబైల్ ఫోన్ లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ సత్తుపల్లి పట్టణ సుందరీకరణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజల హృదయాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు చిరస్థాయిలో నిలిచిపోతారని అన్నారు. బేతుపల్లి హై లెవెల్ కెనాల్, వేంసూరు ఎత్తిపోతల పథకం వంటి కొన్ని అభివృద్ధి పనులను భగవంతుడు శ్రీరామచంద్రుని ఆశీస్సులతో పూర్తిచేసే అవకాశం సత్తుపల్లి ప్రజలు తనకు అందించారని మంత్రి తెలిపారు.

రాజకీయాలక‌తీతంగా అభివృద్ధి

రాజకీయాల, పార్టీలకతీతంగా సత్తుపల్లి కేంద్రంగా గ్రీన్ ఫీల్డ్ హైవే, రైల్వే లైన్, నీటి పారుదల సౌకర్యం కల్పన అభివృద్ధి పనులు జరిగేందుకు తన వంతు కృషి చేయడం జరుగుతుందని మంత్రి తుమ్మ‌ల తెలిపారు. సత్తుపల్లి గౌరవం కాపాడే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పని చేయాలని అన్నారు. నీలాద్రి అర్బన్ పార్క్ అభివృద్ధి కోసం ప్రతిపాదనలు తయారు చేస్తే ప్రభుత్వంతో చర్చించి నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని అన్నారు. సత్తుపల్లిలో జరిగే పని రాష్ట్రమంతా విస్తరించేలా చూడాలని అన్నారు. మన దగ్గర ఉన్న చెరువు, బడి, కళాశాల, రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్థిక పరిస్థితులకు ఇబ్బందులు ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. సింగరేణి వల్ల సత్తుపల్లి నియోజక వర్గ పరిధిలో ఉత్పన్నమయ్యే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూ నష్టపోయిన గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసేలా సంబంధిత శాఖ మంత్రి, సింగరేణి ఎండితో చర్చిస్తామని, దీనికి అనుగుణంగా సమగ్ర రిపోర్టు తయారు చేయాలని తెలిపారు.

గోదావ‌రి జ‌లాలు తీసుకొస్తాం..!

సీతారామ ఎత్తిపోతల పథకం కింద యాతాలకుంట టన్నెల్, ఇతర పనులు పూర్తి చేసేందుకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేస్తే రాబోయే జూన్ నాటికి గోదావరి జలాలను తీసుకుని వస్తానని మంత్రి తెలిపారు.వేంసూరు మండలానికి కృష్ణ జలాలతో పాటు గోదావరి జలాలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఆయిల్ పామ్ పంట సాగు విస్తరిస్తున్న నేపథ్యంలో కల్లూరు గూడెంలో మరో ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తున్నామని అన్నారు. ఆయిల్ పామ్ పంట ఉత్పత్తి పెరిగేందుకు తెనే టీగలను పెంచాలని అన్నారు. చిన్నపిల్లలు ఆకర్షితులయ్యే విధంగా జంతువులు, ఇతర వసతులను పార్కులో ఏర్పాటు చేయాలని, దీనికి అవసరమైన పూర్తి సహాయ, సహకారం ప్రభుత్వం తరపున అందిస్తామని అన్నారు. మొక్కల పెంపకం ప్రణాళిక ప్రకారం చేయాలని, రోడ్ల విస్తరణ ప్రణాళికలు ఉన్న ప్రదేశాలలో రోడ్లకు కొంత దూరంలో మొక్కలు పెట్టాలని, కరెంట్ తీగలు క్రింద ఎటువంటి మొక్కలు పెట్టాలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు.

త్వ‌ర‌లోనే అర్బన్ పార్క్ : క‌లెక్ట‌ర్ అనుదీప్ దురిశెట్టి

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ సత్తుపల్లి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా వచ్చే దుష్పరిణామా లను తగ్గించేందుకు వీలుగా అర్బన్ పార్క్ ను వీలైనంత మేరకు ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, మంత్రివర్యులతో కలిసి నీలాద్రి అర్బన్ పార్క్ లో అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. అర్బన్ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తున్న ఆటవీ శాఖ సిబ్బందికి కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. సాంకేతికతను వినియోగిస్తూ నీలాద్రి అర్బన్ ఫారెస్ట్ లో మనం సృష్టించిన వన సంపదను శాశ్వతంగా కాపాడుకోవాలని కలెక్టర్ తెలిపారు. అర్బన్ ఫారెస్ట్ సంరక్షణ కోసం అటవీ శాఖకు డ్రోన్ కెమెరాలను అందించడం జరుగుతుందని, వెలుగు మట్ల, నీలాద్రి అర్బన్ ఫారెస్ట్ సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్ర‌తీ నెలా అటవీ సంరక్షణ కోసం ఎఫ్.పి.సి. కమిటీ సమావేశాలు నిర్వహించి క్షేత్ర స్థాయిలో ఉత్పన్నమయ్యే చిన్న, చిన్న సమస్యలు ఏర్పాటుకు పరిష్కరించుకోవాలని అన్నారు. అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమం లో ఎస్ఎఫ్ఎస్ మంజుల, సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్, కల్లూరు మార్కెట్ కమిటి చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజలా రాణి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img