epaper
Monday, March 2, 2026
epaper

నిర్విరామ సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు

  • జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ప్రజలకు నిర్విరామంగా సేవలు అందించిన సిబ్బందికి జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారిణి, కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెప్టెంబర్ లో పదవీ విరమణ పొందిన సిబ్బంది కోసం సోమవారం ప్రజావాణి అనంతరం ఏర్పాటు చేసిన రిటైర్మెంట్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసి అభివృద్ధి శాఖ పరిధిలో సహాయ బీసి అభివృద్ధి అధికారిగా పని చేసిన ఎం.ఈదయ్య, వెటర్నరీ శాఖలో ఆఫీస్ సబార్డినేట్ జి.సావిత్రి పదవీ విరమణ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ మాట్లాడుతూ పదవీ విరమణ జీవితంలో చాలా కీలకమైన ఘట్టమని, మనకు గుర్తింపు ఉద్యోగం నుంచి లభిస్తుందని అన్నారు. 30 సంవత్సరాలకు పైగా ప్రభుత్వ రంగంలో సేవలు అందించడం చాలా గొప్ప విషయమని, ప్రజలకు వివిధ రంగాలలో దశాబ్దాల కాలంగా సేవలు అందించి నేడు పదవి విరమణ పొందుతున్న ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పదవీ విరమణ పొందిన ఎం. ఈదయ్య మాట్లాడుతూ బీసీ అభివృద్ధి శాఖలో హాస్టల్ సంక్షేమ అధికారిగా విధులలో చేరి నేడు సహాయ బిసి అభివృద్ధి అధికారిగా ఐదేళ్ల నుంచి పని చేస్తూ నేడు పదవి విరమణ పొందడం సంతోషంగా ఉందన్నారు.

విధి నిర్వహణలో తనకు సహకరించిన అధికారులకు, తోటి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. వెటర్నరీ శాఖలో ఆఫీస్ సబార్డినేట్ గా పదవీ విరమణ పొందిన సావిత్రి మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా తాను వెటర్నరీ శాఖలో పని చేస్తున్నానని, తనకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డిఆర్ఓ వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి, వెటర్నరీ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img