epaper
Thursday, January 15, 2026
epaper

సామాజిక అసమానతలే ఓల్గా స్త్రీవాదానికి గమ్యం

సామాజిక అసమానతలే ఓల్గా స్త్రీవాదానికి గమ్యం
పిత్రృస్వామిక అణచివేతపై సాహిత్య ప్రతిఘటన
కేంద్ర సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు ఆచార్య సి. మృణాళిని

కాకతీయ, ఖమ్మం : సామాజిక అసమానతలు, పిత్రృస్వామిక భావజాల అణచివేతలే ఓల్గా రచనల స్త్రీవాద గమ్యంగా, గమనంగా మారాయని ప్రముఖ సాహిత్య విశ్లేషకురాలు, విశ్రాంత ఆచార్యులు, కేంద్ర సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు, తెలుగు విభాగ కన్వీనర్ ఆచార్య సి. మృణాళిని అన్నారు. ఆదివారం ఖమ్మంలో స్వేచ్ఛావరణం ఆధ్వర్యంలో ‘ఖమ్మం కళా ఉత్సవం’ పేరుతో నిర్వహించిన ఓల్గా 75వ జయంతి సందర్భంగా జరిగిన సాహిత్య సమాలోచన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు. ఓల్గా తన కథలు, నవలలు, కవిత్వం, వ్యాసాలు, సంపాదకీయాలు, సీరియల్స్ ద్వారా స్త్రీల హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం అంశాలను బలంగా ప్రతిపాదించారని ఆచార్య మృణాళిని పేర్కొన్నారు. జెండర్ వివక్ష లేని మానవ హక్కుల కోసం ఆమె చేసిన రచనా ప్రయాణం తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందన్నారు. స్త్రీవాద అస్తిత్వ స్పృహతో అనేక సాహిత్య ప్రక్రియలను ఓల్గా పరిపుష్టం చేశారని తెలిపారు.

సమాజాన్ని ప్రశ్నించిన రచనలు

ప్రముఖ కథా రచయిత్రి వి. ప్రతిమ మాట్లాడుతూ… ఓల్గా రచనలు స్త్రీల సాధికారతకు, అస్తిత్వ చైతన్యానికి ప్రతీకలుగా నిలిచాయని చెప్పారు. కుటుంబ, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థల్లో దాగి ఉన్న అసమానతలను ఆమె రచనలు బహిర్గతం చేశాయన్నారు. కార్యక్రమ సమన్వయకర్త సుమతి లక్ష్య ప్రకటన చేయగా, ఓల్గా గత ఐదు దశాబ్దాల రచనల సారాంశ పోస్టర్ ప్రదర్శనను అడ్వకేట్ పి. సంధ్యారాణి ప్రారంభించారు. అనంతరం ‘ఓల్గాతీరం’ పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రచయిత్రులు పాటి బండ్ల రజని, సభాధ్యక్షురాలు వి. సునంద, డా. కె. ఆనందవాణి, డా. నాగమణి, డా. జతిన్ కుమార్, అక్కినేని కుటుంబరావు రవిమారుత్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన ‘ఓల్గా రాజకీయ కథలు – విశ్లేషణ’ వ్యాసరచన పోటీల విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. చివరగా ఓల్గా స్పందిస్తూ… సమాజంలోని సామాజిక సంక్లిష్టతే తన రచనల నేపథ్యమని, స్త్రీల మధ్య సహకారం పెరగాలని, నిర్ణయాధికారం స్త్రీల చేతుల్లో ఉండాలనే ఆశయంతోనే తన రచనలు కొనసాగుతున్నాయని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img