- నాయకులు కలిసి సమన్వయంతో పనిచేయాలి
- వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్
కాకతీయ, జూలూరుపాడు : స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండలంలోని నాయకులు, ముఖ్య కార్యకర్తలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని దళారీ వ్యవస్థ లేకుండా ప్రతీ లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందేలా కార్యకర్తలు,నాయకులు పని చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రైతు భరోసా కింద రైతులకు 2 లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నామని, కటింగ్ లేకుండా తడిసిన, రంగు మారిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నదని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
అసత్యాలను తిప్పికొట్టాలి
ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అదుబాటులో ఉండి కాంగ్రస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరించాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని, ప్రజలను ధైర్యంగా ఓటు అడుగుతామన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ఎంతో కష్టపడ్డారని, రాబోయే స్థానిక ఎన్నికలలో పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే నాయకుల విజయానికి తాను కష్ట పడుతానని రాందాస్ నాయక్ స్పష్టం చేశారు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలు ఒంటరిగా కాకుండా అందరూ కలిసి కట్టుగా పార్టీ అభివృద్ధికి, అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడాలని ప్రతి గ్రామాల్లో కార్యకర్తలు అందరూ ఒక కూటమిగా అన్ని వర్గల ప్రజలు ఏర్పడి పార్టీ అభివృద్ధి పధకాలను ప్రజలకు చేరవేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థల గెలుపుకోసం పని చెయ్యాలని నాయకులుకు, కార్యకర్తలకు సూచించారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చెప్పిన విధంగా స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు పని చేస్తున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి.


