epaper
Thursday, January 15, 2026
epaper

కేసీఆర్ హయాంలోనే పోరాటయోధులకు గౌరవం

కేసీఆర్ హయాంలోనే పోరాటయోధులకు గౌరవం
ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఐలమ్మకు అవమానం
ఐలమ్మ జయంతిన మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనకపోవడంపై సరికాదు
బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : పోరాడి సాధించుకున్న తెలంగాణలో పోరాట యోధులు, ప్రాణ త్యాగం చేసిన వీరులకు కాంగ్రెస్ పాలనలో అవమానం జరిగిందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అన్నారు. సాయుధ రైతాంగ పోరాట వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శుక్రవారం ఖమ్మం నగరంలో ఆమె విగ్రహం వద్ద నివాళులర్పించేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్ నాయకులను అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
“కలెక్టర్ వచ్చాకే మీరు దండలు వేయాలి” అంటూ అధికారుల నిరంకుశ వైఖరిపై నగర బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. కలెక్టర్ కార్యక్రమం ఉదయం 9.30 గంటలకు నిర్ణయించి 11 గంటలైనా రాకపోగా, తమను అడ్డుకోవడం బలహీన వర్గాల ఆత్మగౌరవానికి భంగమని విమర్శించారు. బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాగరాజు, నేతలు బిచ్చాల తిరుమలరావు, మేకల సుగుణరావు, షకినా మాట్లాడారు. తెలంగాణ సాధించిన తర్వాత బలహీన వర్గాల పోరాటయోధుల జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న ల విగ్రహాలను ఏర్పాటుచేశారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం యోధుల విగ్రహాలకు గౌరవం ఇవ్వకపోవడం వివక్షతకే నిదర్శనమని మండిపడ్డారు. గతంలో పువ్వాడ అజయ్‌కుమార్ సహకారంతో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటైందని, కానీ నేడు ఆ విగ్రహానికి కూడా పూలదండలు వేసే అవకాశం లేకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, మక్బూల్, భోజట్ల రామ్మోహన్, వీరభద్రం, ఉస్మాన్, కందాల వీరేందర్, నెమలి కిషోర్, ఆసిఫ్, పొలే పొంగు వెంకట్, అఫ్రోజ్, మాధవి, పిట్టల తిరుమల్, ఎడ్లపల్లి నవీన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img