epaper
Thursday, January 15, 2026
epaper

బ్యాంక్ కస్టమర్లకు ఊరట?

బ్యాంక్ కస్టమర్లకు ఊరట?
అన్ని బ్యాంకులకు ఒకే ఛార్జీలు, నిబంధనలు!
ఆర్బీఐ కసరత్తు షురూ

కాక‌తీయ‌, బిజినెస్ : బ్యాంకింగ్‌ సేవలు వినియోగించుకునే కస్టమర్లకు త్వరలో శుభవార్త లభించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బ్యాంకును బట్టి వేర్వేరుగా ఉన్న కనీస బ్యాలెన్స్‌ నిబంధనలు, ఏటీఎం వార్షిక ఫీజులు, ఇతర సేవా రుసుములను దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఒకే విధంగా (ప్రామాణికంగా) అమలు చేసే దిశగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులతో ఆర్బీఐ ఇప్పటికే చర్చలు జరుపుతోంది.

అదనపు భారం తగ్గించేందుకే..!

ప్రస్తుతం ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులలో కనీస బ్యాలెన్స్ (Minimum Balance) నిర్వహణ నిబంధనలు భిన్నంగా ఉన్నాయి. కొన్ని బ్యాంకుల్లో ఇది రూ.10 వేలుగా ఉండగా, మరికొన్నింటిలో రూ.15 వేలుగా ఉంది. అలాగే, ఏటీఎం వార్షిక ఛార్జీలు కూడా బ్యాంకును బట్టి మారుతున్నాయి. ఈ భిన్నమైన నిబంధనల కారణంగా కస్టమర్లు తరచూ అదనపు ఆర్థిక భారం మోయాల్సి వస్తోంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతోనే ‘ప్రామాణిక సేవా రుసుము విధానం’ (Standardised Service Charges) తీసుకురావాలని ఆర్బీఐ భావిస్తోంది.

పారదర్శకంగా ప్రాసెసింగ్‌ ఫీజులు..

బ్యాంకింగ్‌ వర్గాల సమాచారం ప్రకారం, వివిధ సేవలపై వసూలు చేస్తున్న ఛార్జీలను సరళీకృతం చేయడమే ఈ ప్రతిపాదనల ముఖ్య లక్ష్యం. ముఖ్యంగా, రుణాలకు (Loans) సంబంధించి దరఖాస్తు చేసినప్పటి నుంచి మంజూరు లేదా తిరస్కరణ వరకు వసూలు చేసే ప్రాసెసింగ్‌ ఫీజులను పూర్తిగా పారదర్శకంగా, ముందే తెలియజేసేలా నిబంధనలు రూపొందించనున్నారు. దీంతో కస్టమర్లకు ఎలాంటి అయోమయం ఉండదని ఆర్బీఐ భావిస్తోంది. అదేవిధంగా, కనీస బ్యాలెన్స్‌ నిర్వహించనందుకు విధిస్తున్న జరిమానాలపై కూడా ఆర్బీఐ పునఃపరిశీలన జరపనుంది. ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ జరిమానాలను ఉపసంహరించుకున్నాయి. ఆర్బీఐ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, దేశవ్యాప్తంగా బ్యాంకు సేవలు మరింత సులభంగా, కస్టమర్‌కు అనుకూలంగా మారతాయని బ్యాంకింగ్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A07 5G

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A07 5G త్వరలో విడుదలకు స‌న్నాహాలు కాక‌తీయ‌, బిజినెస్ :...

తీవ్ర సంక్షోభం… ఫ్లైట్ల రద్దుతో కుప్పకూలిన ఇండిగో షేర్లు..!

తీవ్ర సంక్షోభం… ఫ్లైట్ల రద్దుతో కుప్పకూలిన ఇండిగో షేర్లు..! సిబ్బంది కొరత వేళ...

హెచ్‌పీలో భారీగా లేఆఫ్స్.. ఏఐ ఎఫెక్టేనా..?

హెచ్‌పీలో భారీగా లేఆఫ్స్.. ఏఐ ఎఫెక్టేనా..? హెచ్‌పీ లేఆఫ్స్‌ కలకలం ఏఐ ధాటికి 6...

న్యూ అవతార్‌లో టాటా సియ‌ర్రా..

న్యూ అవతార్‌లో టాటా సియ‌ర్రా.. ధ‌ర‌, ఫీచ‌ర్ల వివ‌రాలు ఇవే! ఆటోమొబైల్ ఫ్యాన్స్‌కు గుడ్...

ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్..ఈ నెల 30తో ఆ సేవ‌లు బంద్‌!

ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్..ఈ నెల 30తో ఆ సేవ‌లు బంద్‌! స్టేట్ బ్యాంక్...

ChatGPT ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో..!

ChatGPT ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో..! ఓపెన్ ఏఐ-ఫోన్‌పే వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటింపు కన్స్యూమర్ మరియు...

టాటా ట్రస్ట్స్‌లో విభేదాల మళ్లీ వెలుగులోకి..!

టాటా ట్రస్ట్స్‌లో విభేదాల మళ్లీ వెలుగులోకి..! రతన్ టాటా తర్వాత వారసత్వ పోరు నోయెల్...

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో..

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో.. కిలోమీటర్‌కి 90 పైసలే! ఎలక్ట్రిక్ మార్కెట్‌లో హీరో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img