epaper
Monday, March 2, 2026
epaper

రేషన్ డీలర్ బెదిరింపులు!

రేషన్ డీలర్ బెదిరింపులు!
కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్తగూడెంలో ఉద్రిక్తత
ఓటమి చెందిన అభ్యర్థి బంధువుల బూతు పురాణం
“రేషన్ ఎలా తీసుకుంటారో చూస్తా” అంటూ ఓటర్లకు దంకీలు
ప్రజలకు సేవ చేయాల్సిన డీలర్ బెదిరింపులపై ఆగ్రహం
ఓటర్లను టార్గెట్ చేస్తూ అవమానకర వ్యాఖ్యలు
కలెక్టర్, ఎమ్మార్వోలకు ఫిర్యాదు చేయనున్న బాధితులు

కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల అనంతరం కొన్ని డివిజన్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా 28వ డివిజన్‌లో ఓటమి చెందిన అభ్యర్థి బంధువులుగా ఉన్న రేషన్ డీలర్ ఓటర్లపై బూతులు తిట్టుతూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమే అయినప్పటికీ, ఓటమిని జీర్ణించుకోలేక ప్రజలపై అసభ్యకరంగా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేశారు. ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థులను ఎన్నుకుని కార్పొరేటర్లుగా గెలిపించగా, మిగిలిన వారు ఓటమిపాలయ్యారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల తర్వాత కూడా ఓటమిని అంగీకరించలేక కొందరు వ్యక్తులు ఓటర్లను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

రేషన్ కోసం వచ్చిన వారిపై బూతులు

28వ డివిజన్‌లో ఓడిపోయిన అభ్యర్థి బంధువులు గత కొంతకాలంగా రేషన్ డీలర్‌గా కొనసాగుతున్నారు. తమ బంధువు ఓడిపోవడంతో రేషన్ కోసం వచ్చే ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ “అందరూ కలిసి మా వాడిని ఓడించారు” అంటూ బూతులు తిట్టుతున్నట్లు బాధితులు తెలిపారు. రేషన్ తీసుకోవడానికి వచ్చే ప్రజలను అవమానిస్తూ మాట్లాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి నెల రేషన్ కోసం ప్రజలు రావాల్సిందేనని, అప్పుడు ఎలా వస్తారో చూస్తామని ఇండైరెక్ట్‌గా బెదిరింపులు చేస్తున్నట్లు ఓటర్లు చెబుతున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన రేషన్ డీలర్ ఇలా రాజకీయ కారణాలతో బెదిరింపులకు పాల్పడటం సరైంది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా ప్రజల ఓట్లతో ఎదిగిన నాయకులు, వారి బంధువులు ఇప్పుడు ఓటమి చవిచూడగానే అసలు స్వరూపం బయటపడుతోందని 28వ డివిజన్ ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తులు రాజకీయాలకు అనుగుణంగా ప్రవర్తించడం అనైతికమని పేర్కొన్నారు.

అధికారులకు ఫిర్యాదు

ఈ ఘటనపై బాధితులు సోమవారం జిల్లా కలెక్టర్, ఎమ్మార్వోలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. రేషన్ డీలర్‌పై తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తులు బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img