epaper
Saturday, November 15, 2025
epaper

రాహుల్ ఆలోచనల మేరకే పాదయాత్ర

రాహుల్ ఆలోచనల మేరకే పాదయాత్ర
ప్రజల్లోకి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు తీసుకెళ్లడమే కాంగ్రెస్ లక్ష్యం
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామన్న నేతలు
హనుమకొండలో జనహిత పాదయాత్ర సన్నాహక సమావేశం

కాకతీయ, హనుమకొండ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర విజయవంతం చేయాలని హనుమకొండ లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీసీ నాయకులు, మేయర్ గుండు సుధారాణి తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు చేపడుతున్న ఈ పాదయాత్ర ద్వారా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. 20 నెలల్లో దేశంలో ఎక్కడా చూడని అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని, వాటిని ప్రజలకు చేరవేయడమే ఈ యాత్ర ఉద్దేమని అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో పాదయాత్ర ఆగస్టు 25 సాయంత్రం 4 గంటలకు ఇల్లంద మార్కెట్ నుండి వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్ వరకు పాదయాత్ర, ఆగస్టు 26 ఉదయం 6.30 గంటలకు వర్ధన్నపేట ఫిరంగిగడ్డ ప్రభుత్వ పాఠశాలలో శ్రమదానం, ఉదయం 10 గంటలకు ఐనవోలు మల్లికార్జున స్వామివారి దర్శనం, ఉదయం 11.30 గంటలకు వర్ధన్నపేట శివారు లక్ష్మి గార్డెన్స్‌లో జిల్లా కార్యకర్తల సమావేశం ఉంటుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మంత్రులు, నేతలు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల అభివృద్ధి, పదవుల కేటాయింపులో చురుకుగా పని చేస్తామని చెప్పారు. సమావేశం ప్రారంభానికి ముందు ఇటీవల పరమపదించిన సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డికి మౌనం వహించి నివాళులర్పించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img