కొమురవెల్లి ఏఈఓగా విధుల్లో చేరిన ఆర్ సుదర్శన్
కాకతీయ, కొమురవెల్లి : శ్రీ మల్లికార్జున దేవస్థానం కొమురవెల్లి దేవాలయ సహాయ కార్య నిర్వహణ అధికారిగా ఆర్ సుదర్శన్ విధుల్లో చేరారు .స్వామి వారి దర్శనం చేస్తున్న అనంతరం ఈవో సమక్షంలో విధుల్లో చేరారు 2019వ సంవత్సరంలో దేవాలయం నుండి జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర దేవాలయానికి డిప్యూటేషన్ పై బదిలీ అయి దేవాదాయ శాఖ కమిషనర్ డిప్యూటేషన్ ఉత్తర రద్దు చేస్తూ కొమరవెల్లి దేవాలయాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందున ఈరోజు కార్యాలయంలో విధుల్లో చేరారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు కార్యనిర్వాహణాధికారి టంకాశాల వెంకటేష్ విధుల్లో చేర్చుకున్నారు సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్ చిన్న మల్లికార్జున్ జగదీశ్వర్ పర్యవేక్షకులు చంద్రశేఖర్ ధర్మకర్త మండలి సభ్యులు సార్ల లింగం దేవాలయ సిబ్బంది శంకర్ శర్మ మధుకర్ సిద్దయ్య నర్సింలు తదితరులు ఉన్నారు.


