అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపండి
* చేర్యాల ఎస్సై ని కలిసిన రాంపూర్ సర్పంచ్
కాకతీయ, చేర్యాల: చేర్యాల నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన జి. అపూర్వ రెడ్డిని సోమవారం రాంపూర్ గ్రామ సర్పంచ్ శెట్టే కొమురయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొమురయ్య మాట్లాడుతూ. పార్టీలకతీతంగా న్యాయబద్ధంగా పనిచేయాలని ఎస్సైకి విజ్ఞప్తి చేశారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపి, ప్రజలకు రక్షణ కల్పించాలని వారు కోరారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలు పరిరక్షించడానికి కృషి చేస్తానని, శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మండలంలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్న నేరుగా పోలీసు స్టేషన్ లో సంప్రదించాలన్నారు ఎస్సై అపూర్వ రెడ్డి తెలిపారు.


