మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత
కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలోని 8వ వార్డుకుచెందిన ఉట్లపల్లి చిన్న యాదయ్య , అదేవిధంగా శ్రీరాంనగర్ కాలానికి చెందిన ఆడెపు కుమార్ లు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయం విధితమే. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ నాయకులు, చేర్యాల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్ రెడ్డి, 8వ వార్డు కౌన్సిలర్ బుదారి సురేష్ లు మృతుల కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్న యాదయ్య మృతుడి కుటుంబానికి రూ.5000 ఆర్థిక సహాయం అందిచగా, ఆడెపు కుమార్ కుటుంబానికి 50 కిలోల బియాన్ని అందజేశారు. పరామర్శించిన వారిలో, బిఆర్ఎస్ నాయకులు బీరెడ్డి ఇన్నారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఆనంతుల మల్లేశం,మంచాల కొండయ్య,పాము శ్రీనివాస్, పాతకోటి భాస్కర్, మధుతో పాటు తదితరులు ఉన్నారు.


