తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా
*పురం ఆంజనేయులు ఏకగ్రీవం
సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి
కాకతీయ, గజ్వేల్ : తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్లో అధ్యక్షుడిగా పురం ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా విజయ్ కాంత్, కరుణాకర్ రెడ్డి, కోశాధికారి బాకీ నర్సింహులు ఎన్నికైనారు. ఈ సందర్భంగా పురం ఆంజనేయులు మాట్లాడుతూ…నన్ను యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుండి కృషి చేస్తాను అన్నారు. ఎలాంటి అపద వచ్చినా సభ్యులను వెనితెప్పకుండా ఆదుకుంటూ ముందుంచేందుకు ప్రయత్నిస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నర్సెట్టి నర్సింలు, కొత్త గంగాధర్ రావు, ప్రచార కార్యదర్శి డప్పు ఎల్లం, సలహాదారు నుచ్చు సాయికుమార్, సభ్యులు బిక్షపతి, కుమార్, మంద బాల్ రాజ్, ఐరేణి కుమార్ గౌడ్, పురం కుమార్ స్వామి, మణిగల కృష్ణ, చెప్యాల కుమార్ పాల్గొన్నారు.


