పద్మావతి ఖని వీకే కోల్ మైండ్ సందర్శన
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి ఖని, వికే కోల్ మైన్ ను సందర్శించిన డైరెక్టర్ (ప్లానింగ్ , ప్రాజెక్ట్స్) కొప్పుల వెంకటేశ్వర్లు ఆదివారం సందర్శించార
ముందుగా పద్మావతి ఖని లో జరుగుతున్న టనల్ పనులను సంబంధిత అధికారులతో సమీక్షించి ప్రతి ఒక్కరూ రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదక పనులను చేయాలని సూచించారు అనంతరం వారు వికే కోల్ మైన్ వ్యూ పాయింట్ నుండి ఓపెన్ క్యాస్ట్ లో జరుగుతున్న మట్టి తొలగింపు పనులను పరిశీలించారు అనంతరం మట్టి తొలగింపు పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ కు అనుకున్న సమయము లోగా బొగ్గు ఉత్పత్తి కొరకు కావలసిన మట్టి తొలగింపు పనులను పూర్తి చేసుకోవాలని, అలాగే ఓబీ డంపులలో హాలర్ రోడ్ పై తగు రక్షణ సూత్రాలను పాటిస్తూ పనులను చేయవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే వీకే కోల్ మైన్ కోల్ డిస్పాచ్ ఏర్పాట్ల, ప్రస్తుత స్థితిని సమీక్షించారు. ఈ సందర్శన సందర్భంగా, కొత్తగూడెం ఏరియా ఉత్పత్తి , డిస్పాచ్ వివరాలను ఏరియా ఎస్ ఓ టు జిఎం జి.వి. కోటిరెడ్డి వివరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం తో పాటు పద్మావతి ఖని ఏజెంట్ రామ్ భరోస్.మహాతో, మేనేజర్ ఎం.వి.ఎన్. శ్యాం ప్రసాద్, వికే కోల్ మైన్స్ , మేనేజర్ రామచంద్ర మురళి, శోధ ఓబీ కాంట్రాక్ట్ మేనేజర్ కిషోర్ ఇతర సంబంధిత ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.



