epaper
Thursday, January 15, 2026
epaper

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం
గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ ర‌ద్దు.. త్వరలో నూతన కమిటీలు
టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య

కాకతీయ, ఖమ్మం : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు సాధించేవరకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నిరంతరం పోరాడుతుందని ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య స్పష్టం చేశారు. సోమవారం ఖమ్మంలోని కోణార్క్ హోటల్‌లో సంతోష్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని తెలిపారు. టీడబ్ల్యూజేఎఫ్‌పై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మామిడి సోమయ్య తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులను అయోమయానికి గురి చేసేందుకు, సంఘం తమదే అన్నట్లుగా కొందరు మాజీ నాయకులు చేస్తున్న ప్రచారాలను జర్నలిస్టులు నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఫెడరేషన్‌లోని వ్యవస్థాపక సభ్యులు అన్ని జిల్లాలు తిరుగుతూ సంఘం బలోపేతానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కూడా సంఘాన్ని బలోపేతం చేయడానికి త్వరలో జిల్లా మహాసభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాలేదు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న
ప్పటికీ జర్నలిస్టుల ప్రధాన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి టీడబ్ల్యూజేఎఫ్ సిద్ధమవుతుందని హెచ్చరించారు. జర్నలిస్టుల పక్షాన నిలబడి సమస్యలపై నిరంతరం పోరాటం చేసే ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఐఎఫ్‌డబ్ల్యుజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఐఎఫ్‌డబ్ల్యుజే నిరంతరం పోరాడుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాకు అడ్‌హాక్ కమిటీని ప్రకటించారు. ఖమ్మం జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ కన్వీనర్‌గా టీ. సంతోష్ చక్రవర్తి, కో-కన్వీనర్లుగా అర్వపల్లి నగేష్, అంతోటి శ్రీనివాస్, నానబాల రామకృష్ణ, వందనపు సామ్రాట్‌లను రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు చేసినట్లు, త్వరలో కొత్త రాష్ట్ర కమిటీతో పాటు అన్ని జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం సత్తుపల్లి కి చెందిన సీనియర్ రిపోర్టర్ దమ్మాలపాటి సత్యనారాయణ మృతికి సంతాపం ప్రకటించారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కో-కన్వీనర్లు వల్లాల జగన్, జి. వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పి. గోపాల్, సూర్యపేట కమిటీ బాధ్యులు పాల్వాయి జానయ్య, సీనియర్ జర్నలిస్టులు రఘురాం, సాదిక్ పాషా, న్యాయ సలహాదారులు పసుపులేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img