epaper
Thursday, January 15, 2026
epaper

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా
* 11 దాటినా జాడలేని అధికారులు
* 29 శాఖలకు గాను ఐదుగురే హాజరు
* ఖాళీ కుర్చీలతో వేదిక

కాకతీయ, కారేపల్లి : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల స్థాయి అధికారుల తీరు ప్రజావాణి ఉద్దేశాన్నే ప్రశ్నార్థకం చేస్తోందన్న విమర్శలు మండలవ్యాప్తంగా జోరుగా వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.


సోమవారం ఉదయం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణికి 29 శాఖలకు చెందిన అధికారులు హాజరు కావాల్సి ఉండగా, ఉదయం 11.30 గంటలు దాటినా కేవలం ఐదు శాఖల అధికారులు మాత్రమే పాల్గొన్నారు. మిగిలిన శాఖల అధికారుల గైర్హాజరుతో ప్రజావాణి వేదికపై ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.
సమస్యలు వినేందుకు కాదు… సంతకాల కోసమేనా?
ప్రజావాణి ప్రారంభ సమయానికి అధికారులు రాకపోవడంతో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొందరు అధికారులు ఆలస్యంగా వచ్చి కేవలం హాజరు సంతకాలు పెట్టుకుని వెళ్లిపోవడం ప్రజావాణి అసలు ఉద్దేశాన్నే ప్రశ్నార్థకం చేస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. సమస్యలు వినేందుకు కాదు… అధికారుల సంతకాల కోసమే ప్రజావాణి అన్నట్లుగా వ్యవహారం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మండల స్థాయిలో సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణికి దరఖాస్తులు చేసుకునేందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మండల ప్రజావాణి పేరుకే పరిమితమై, అసలు లక్ష్యం నెరవేరడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారుల నిర్లక్ష్యం నీరుగారుస్తోందని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ప్రజావాణికి గైర్హాజరైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

టెట్‌ ప్రశాంతం!

టెట్‌ ప్రశాంతం! ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేవు రెండు సెషన్లలో సజావుగా నిర్వహణ జిల్లా కలెక్టర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img