epaper
Monday, March 2, 2026
epaper

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా
* 11 దాటినా జాడలేని అధికారులు
* 29 శాఖలకు గాను ఐదుగురే హాజరు
* ఖాళీ కుర్చీలతో వేదిక

కాకతీయ, కారేపల్లి : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల స్థాయి అధికారుల తీరు ప్రజావాణి ఉద్దేశాన్నే ప్రశ్నార్థకం చేస్తోందన్న విమర్శలు మండలవ్యాప్తంగా జోరుగా వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.


సోమవారం ఉదయం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణికి 29 శాఖలకు చెందిన అధికారులు హాజరు కావాల్సి ఉండగా, ఉదయం 11.30 గంటలు దాటినా కేవలం ఐదు శాఖల అధికారులు మాత్రమే పాల్గొన్నారు. మిగిలిన శాఖల అధికారుల గైర్హాజరుతో ప్రజావాణి వేదికపై ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.
సమస్యలు వినేందుకు కాదు… సంతకాల కోసమేనా?
ప్రజావాణి ప్రారంభ సమయానికి అధికారులు రాకపోవడంతో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొందరు అధికారులు ఆలస్యంగా వచ్చి కేవలం హాజరు సంతకాలు పెట్టుకుని వెళ్లిపోవడం ప్రజావాణి అసలు ఉద్దేశాన్నే ప్రశ్నార్థకం చేస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. సమస్యలు వినేందుకు కాదు… అధికారుల సంతకాల కోసమే ప్రజావాణి అన్నట్లుగా వ్యవహారం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మండల స్థాయిలో సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణికి దరఖాస్తులు చేసుకునేందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మండల ప్రజావాణి పేరుకే పరిమితమై, అసలు లక్ష్యం నెరవేరడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారుల నిర్లక్ష్యం నీరుగారుస్తోందని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ప్రజావాణికి గైర్హాజరైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img