epaper
Thursday, January 15, 2026
epaper

అభివృద్ధి కాదు.. పేదలపై దాడి

అభివృద్ధి కాదు.. పేదలపై దాడి
కూరగాయల మార్కెట్ మూసివేతతో పేద‌ల‌కు అన్యాయం
ఖమ్మం జిల్లా మైనార్టీ అధ్యక్షులు తాజుద్దీన్

కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని 44వ డివిజన్‌లో కూరగాయల మార్కెట్‌ను మూసివేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మార్కెట్ మూసివేత అభివృద్ధి చర్య కాదని, పేద చిరు వ్యాపారస్తుల కడుపుపై చేసిన రాజకీయ దాడిగా ఖమ్మం జిల్లా మైనార్టీ అధ్యక్షులు తాజుద్దీన్ ఆరోపించారు.
గతంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముస్లిం మైనార్టీ పేద కూరగాయల వ్యాపారస్తుల కోసం అన్ని మౌలిక వసతులతో ఈ మార్కెట్‌ను నిర్మించి అందించారని గుర్తు చేశారు. ప్రజలు ఆ సేవలను మరిచిపోవాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు టెండర్ల పేరుతో షాపులను ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. రోజువారీ కూరగాయల వ్యాపారంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారస్తులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్న అధికార పార్టీ నిర్ణయాలు అన్యాయమని పేర్కొన్నారు. నిజంగా కొత్త షాపుల అవసరం ఉంటే, టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పాత కూరగాయల మార్కెట్‌ను పునరుద్ధరించాలని సూచించారు. ఇప్పటికీ అక్కడే వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న కుటుంబాలపై దాడి చేయడం సరికాదన్నారు. ఈ అంశంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం కార్పొరేషన్ అధికారులు, అధికార పార్టీ నాయకులు ప్రజలకు వెంటనే సమాధానం చెప్పాలని తాజుద్దీన్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం అక్కడ వ్యాపారం చేస్తున్న ముస్లిం మైనార్టీ వ్యాపారస్తులకు షాపులు దక్కకుండా నష్టం కలిగిస్తే, బీఆర్ఎస్ పార్టీ పక్షాన చిరు వ్యాపారస్తుల తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఖమ్మం నగర ప్రజలకు రోజువారీ కూరగాయలు అందిస్తూ జీవనం సాగిస్తున్న పేదలపై రాజకీయాలు చేయవద్దని హితవు పలికిన తాజుద్దీన్, ప్రజల పక్షాన నిలబడ్డ నాయకుడిగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సేవలను ఖమ్మం ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img