epaper
Sunday, March 1, 2026
epaper

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ
జైలు డైరీ చదివానంటూ మద్దతు
వివాదంగా మారిన స్పందన
2020 దిల్లీ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉమర్ ఖాలిద్ అరెస్టు

న్యూఢిల్లీ/న్యూయార్క్ : దిల్లీ అల్లర్ల కేసులో దాదాపు ఐదేళ్లుగా జైలులో ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్థి, కార్యకర్త ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన జోరాన్ మమ్దానీ మద్దతుగా లేఖ రాయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఖాలిద్ సోదరి వివాహం కోసం 14 రోజుల బెయిల్‌పై విడుదలకు కొద్ది రోజుల ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. డిసెంబర్ 9న ఉమర్ ఖాలిద్ తండ్రి సయ్యద్ ఖాసిమ్ రసూల్ ఇల్యాస్ న్యూయార్క్‌లో మమ్దానీని సుమారు 25 నిమిషాల పాటు కలిశారు. 2023లో ఉమర్ ఖాలిద్ జైలు డైరీని చదివినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ భేటీని ఏర్పాటు చేసినట్లు ఇల్యాస్ తెలిపారు. “ఉమర్ జైల్లో ఉండటం గురించి తాను ఎప్పుడూ ఆలోచిస్తుంటానని, అతడికి బెయిల్ రావాల్సిన అవసరం ఉందని మమ్దానీ అన్నారు” అని ఇల్యాస్ వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం మమ్దానీ ఉమర్ ఖాలిద్‌కు వ్యక్తిగతంగా లేఖ రాశారు. “కోపాన్ని మన మనసును ఆక్రమించనివ్వకూడదన్న నీ మాటలు నన్ను ఆలోచింపజేస్తుంటాయి. నీ తల్లిదండ్రులను కలవడం ఆనందంగా ఉంది. మేమంతా నిన్నే ఆలోచిస్తున్నాం” అంటూ మమ్దానీ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మమ్దానీ తనను, ఉమర్ ఖాలిద్‌ను సామాన్యుల సమస్యల కోసం పోరాడిన వ్యక్తులుగా పోల్చారని ఇల్యాస్ చెప్పారు. “ఈ విషయంలో తాను ఏమి చేయగలనని మమ్దానీ అడిగితే, ప్రార్థించడమే సరిపోతుందని చెప్పాను” అని ఆయన తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సమయంలో తాను హాజరైనట్లు, న్యాయపరంగా సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆశిస్తున్నట్లు ఇల్యాస్ పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై బీజేపీ నేత గౌరవ్ భాటియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమర్ ఖాలిద్ కేసు భారత్‌కు సంబంధించిన అంతర్గత వ్యవహారమని, విదేశీ నేతల జోక్యం సరికాదని వ్యాఖ్యానించారు.

దిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్ అరెస్టు..

2020 ఫిబ్రవరిలో జరిగిన దిల్లీ అల్లర్లకు సంబంధించి ఉమర్ ఖాలిద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అల్లర్లలో 53 మంది మరణించారు. సోదరి వివాహానికి హాజరయ్యేందుకు డిసెంబర్ 16 నుంచి 29 వరకు అతడికి తాత్కాలిక బెయిల్ మంజూరైంది. ఇదిలా ఉండగా, అమెరికా కాంగ్రెస్ సభ్యులు జిమ్ మెక్‌గవర్న్, జేమీ రాస్కిన్ సహా మరో ఆరుగురు శాసనసభ్యులు భారత రాయబారి వినయ్ క్వాత్రాకు లేఖ రాసి, దిల్లీ అల్లర్ల కేసుల్లో నిందితులపై కొనసాగుతున్న దీర్ఘకాలపు ముందస్తు నిర్బంధంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉమర్ ఖాలిద్ అరెస్టు విషయంలో విచారణ, న్యాయ ప్రక్రియ న్యాయసమ్మతతపై మానవ హక్కుల సంస్థలు, న్యాయ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయని వారు పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img