epaper
Monday, March 2, 2026
epaper

మోదీ రైతుల పక్షపాతి

  • 1.7 కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపేందుకే ధన్ ధాన్య క్రుషి యోజన
  • కరీంనగర్ డెయిరీకి కేంద్రం నుండి అన్ని విధాలా సహకారం అందిస్తా..
  • డెయిరీ ప్రొడక్ట్స్ ను ఆపేందుకు కొందరు యత్నిస్తున్నారు
  • లక్షమంది పాడి రైతులతో నడుస్తున్న సంస్థ ఇది
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

కాకతీయ, కరీంనగర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల పక్షపాతి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు భారీగా పెరిగినప్పటికీ, ఆ భారం రైతులపై పడకుండా కేంద్రం భరిస్తోందని, రైతులకు సబ్సిడీ ధరకే యూరియాను అందించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. దేశంలోని 1.7 కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘‘ధన్-ధాన్య కృషి యోజన’’ అనే పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఏటా రూ.24 వేల కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. మొదట దశలో 100 జిల్లాల్లో అమలు చేస్తూ, ఒక్కో సంవత్సరం రూ.24 వేల కోట్ల చొప్పున ఆరేళ్ల పాటు నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు.

లక్ష మంది పాడి రైతుల జీవనోపాధి కరీంనగర్ డెయిరీ

నరేంద్ర మోదీ ఢిల్లీలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన రూ.42 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారని బండి సంజయ్ గుర్తుచేశారు. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని కరీంనగర్ మిల్క్ డెయిరీ ప్రాంగణంలో ఆయన ప్రత్యక్ష ప్రసారం వీక్షించారు. అనంతరం కేంద్రం, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జికా) ఆర్థిక సహకారంతో రూ.90 కోట్ల 70 లక్షల వ్యయంతో నిర్మించిన ఆటోమెటిక్ కర్డ్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కరీంనగర్ డెయిరీ అనేది 27 ఏళ్ల చరిత్ర గల సంస్థగా, లక్ష మంది పాడి రైతుల జీవనోపాధికి ఆధారంగా నిలుస్తోందన్నారు. ఈ సంస్థ రోజుకు 2 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోందని, 40 లక్షల లీటర్ల పెరుగును విక్రయిస్తున్నదని తెలిపారు. ప్రత్యక్షంగా 600 మందికి, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధిని కల్పిస్తున్నదన్నారు. 2021లో ఈ డెయిరీకి 3 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కేంద్రం నుంచి నిధులు వచ్చాయని గుర్తు చేశారు.

కరీంనగర్ డెయిరీ అభివృద్ధిలో రాజేశ్వరరావు పాత్ర అనన్యసాధారణమని సంజయ్ అన్నారు. గతంలో డెయిరీ ఆస్తులను కబ్జా చేయాలనే ప్రయత్నాలు జరిగినప్పుడు తాను కార్పొరేటర్‌ గా ఉద్యమాలు చేసి ఆ ఆస్తులను కాపాడామని ఆయన గుర్తు చేశారు. సిరిసిల్లలో డెయిరీని అధికారులు సీజ్ చేసినప్పుడు కలెక్టర్‌తో మాట్లాడి తిరిగి ప్రారంభించామన్నారు. కరీంనగర్ డెయిరీ ఉత్పత్తులను నిలిపేయడానికి రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు ప్రయత్నిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని బండి వెల్లడించారు. ఈ విషయంపై తాను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని, డెయిరీ ఉత్పత్తులు ఆగకూడదని, వాటిని మరింత విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశ ప్రయోజనాలే ప్రధానికి ప్రథమమని, అంతర్జాతీయంగా కూడా మోదీ తీసుకున్న పలు నిర్ణయాలు దేశ ప్రతిష్ఠను పెంచాయని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఘనంగా శ్రీ పాదరావు 89వ జయంతి వేడుకలు

ఘనంగా శ్రీ పాదరావు 89వ జయంతి వేడుకలు శివాలయంలో మహా అన్నదానం నిర్వహణ గాంధీ...

ఉద్యమకారులకు మరోసారి దరఖాస్తు అవకాశం ఇవ్వాలి

ఉద్యమకారులకు మరోసారి దరఖాస్తు అవకాశం ఇవ్వాలి 250 గజాల భూమి, రూ.20 వేల...

టౌన్ ప్లానింగ్‌లో అవినీతికి చెక్ పెడుతాం

టౌన్ ప్లానింగ్‌లో అవినీతికి చెక్ పెడుతాం లంచాలు తీసుకుంటే క్రిమినల్ కేసులు అక్రమ...

అనుమతి అక్కడ.. నిర్వహణ ఇక్కడ!

అనుమతి అక్కడ.. నిర్వహణ ఇక్కడ! శంకరపట్నం వారసంత రోడ్డుపై ఏర్పాటు జాతీయ రహదారిపై ప్రమాదాలకు...

ఈ నెల 28న నేషనల్ లోక్ అదాలత్

ఈ నెల 28న నేషనల్ లోక్ అదాలత్ రాజీమార్గమే రాజమార్గం అంటూ ముందుకు...

అంబేద్కర్ విగ్రహ ధ్వంసం… కఠిన చర్యలకు డిమాండ్

అంబేద్కర్ విగ్రహ ధ్వంసం… కఠిన చర్యలకు డిమాండ్ కాకతీయ, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని...

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img