epaper
Saturday, November 15, 2025
epaper

మోదీ రైతుల పక్షపాతి

  • 1.7 కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపేందుకే ధన్ ధాన్య క్రుషి యోజన
  • కరీంనగర్ డెయిరీకి కేంద్రం నుండి అన్ని విధాలా సహకారం అందిస్తా..
  • డెయిరీ ప్రొడక్ట్స్ ను ఆపేందుకు కొందరు యత్నిస్తున్నారు
  • లక్షమంది పాడి రైతులతో నడుస్తున్న సంస్థ ఇది
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

కాకతీయ, కరీంనగర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల పక్షపాతి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు భారీగా పెరిగినప్పటికీ, ఆ భారం రైతులపై పడకుండా కేంద్రం భరిస్తోందని, రైతులకు సబ్సిడీ ధరకే యూరియాను అందించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. దేశంలోని 1.7 కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘‘ధన్-ధాన్య కృషి యోజన’’ అనే పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఏటా రూ.24 వేల కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. మొదట దశలో 100 జిల్లాల్లో అమలు చేస్తూ, ఒక్కో సంవత్సరం రూ.24 వేల కోట్ల చొప్పున ఆరేళ్ల పాటు నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు.

లక్ష మంది పాడి రైతుల జీవనోపాధి కరీంనగర్ డెయిరీ

నరేంద్ర మోదీ ఢిల్లీలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన రూ.42 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారని బండి సంజయ్ గుర్తుచేశారు. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని కరీంనగర్ మిల్క్ డెయిరీ ప్రాంగణంలో ఆయన ప్రత్యక్ష ప్రసారం వీక్షించారు. అనంతరం కేంద్రం, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జికా) ఆర్థిక సహకారంతో రూ.90 కోట్ల 70 లక్షల వ్యయంతో నిర్మించిన ఆటోమెటిక్ కర్డ్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కరీంనగర్ డెయిరీ అనేది 27 ఏళ్ల చరిత్ర గల సంస్థగా, లక్ష మంది పాడి రైతుల జీవనోపాధికి ఆధారంగా నిలుస్తోందన్నారు. ఈ సంస్థ రోజుకు 2 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోందని, 40 లక్షల లీటర్ల పెరుగును విక్రయిస్తున్నదని తెలిపారు. ప్రత్యక్షంగా 600 మందికి, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధిని కల్పిస్తున్నదన్నారు. 2021లో ఈ డెయిరీకి 3 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కేంద్రం నుంచి నిధులు వచ్చాయని గుర్తు చేశారు.

కరీంనగర్ డెయిరీ అభివృద్ధిలో రాజేశ్వరరావు పాత్ర అనన్యసాధారణమని సంజయ్ అన్నారు. గతంలో డెయిరీ ఆస్తులను కబ్జా చేయాలనే ప్రయత్నాలు జరిగినప్పుడు తాను కార్పొరేటర్‌ గా ఉద్యమాలు చేసి ఆ ఆస్తులను కాపాడామని ఆయన గుర్తు చేశారు. సిరిసిల్లలో డెయిరీని అధికారులు సీజ్ చేసినప్పుడు కలెక్టర్‌తో మాట్లాడి తిరిగి ప్రారంభించామన్నారు. కరీంనగర్ డెయిరీ ఉత్పత్తులను నిలిపేయడానికి రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు ప్రయత్నిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని బండి వెల్లడించారు. ఈ విషయంపై తాను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని, డెయిరీ ఉత్పత్తులు ఆగకూడదని, వాటిని మరింత విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశ ప్రయోజనాలే ప్రధానికి ప్రథమమని, అంతర్జాతీయంగా కూడా మోదీ తీసుకున్న పలు నిర్ణయాలు దేశ ప్రతిష్ఠను పెంచాయని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరుగుతున్న రహదారి...

17 వ మహాసభ జయప్రదం చేయాలి

17 వ మహాసభ జయప్రదం చేయాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : మందమర్రిలో ఈ...

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : ఓపెన్ కాస్ట్ ఫేజ్...

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప...

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్..

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ బంపర్ "వి"క్టరీ.. సోమాజిగూడ...

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల రఘునాథపాలెం మండలంలో పొలాలు సందర్శించిన మంత్రి...

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌ రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహణ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ...

తిమ్మాపూర్ సర్కిల్ పోలీసు స్టేషన్లను తనిఖీ..

తిమ్మాపూర్ సర్కిల్ పోలీసు స్టేషన్లను తనిఖీ.. తనిఖీ చేసిన అడిషనల్ డీసీపీ వెంకటరమణ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img