epaper
Monday, March 2, 2026
epaper

ఫలించిన మంత్రి తుమ్మల కృషి

  • ఖమ్మం నగరానికి మంచినీటికి శాశ్వత పరిష్కారం
  • రూ.200 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రణాళికతో మంచినీటి సరఫరా
  • 8 నెలలు మున్నేరు నుంచి సురక్షిత నీరు, 4 నెలలు పాలేరు జలాశయం నుంచి
  • గతంలో దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్ ద్వారా ఖమ్మం త్రీ టౌన్ కు మంచినీరు
  • ఖమ్మానికి లకారం నుంచి నీటి సరఫరా

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి ఫలించింది. ఖమ్మం నగర ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆయన సంకల్పంకు అడుగులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం నగరానికి సురక్షితమైన తాగునీరు అందించేందుకు శాశ్వత పరిష్కారం కోసం రూ.200 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ జీ .వో నెంబర్.747 తేదీ 25.10.2025 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు రూపకల్పనతో ఖమ్మం కార్పొరేషన్ ప్రజల కల సాకారం చేసిన అపర భగీరధుడిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖ్యాతి పెరిగింది. ఆయన తపనతో ఈ ప్రణాళిక రూపుదిద్దుకోగా, పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఖమ్మం నగరానికి అద్భుత స్థాయిలో నీటి సరఫరా వ్యవస్థను రూపొందించారు.

మున్నేరు, పాలేరు నుంచి నీటి సరఫరా…

నగరానికి సంవత్సరమంతా నిరంతరంగా మంచినీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు.
మున్నేరు నది నుంచి ఎనిమిది నెలలపాటు నీటి సరఫరా జరుగుతుండగా, వేసవి నెలల్లో పాలేరు జలాశయం నుంచి నీరు అందించనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ విధంగా రెండు వనరుల ఆధారంగా ఖమ్మం నగరానికి నిరాటంకంగా రక్షిత నీటి సరఫరా జరిగేలా ముందు చూపుతో ప్రణాళికలు చేశామన్నారు.

గతంలో దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్‌ ద్వారా త్రీ టౌన్‌ కు నీరు

గతంలో నగరంలోని త్రీ టౌన్‌ ప్రాంతాలకు దానవాయిగూడెం ఫిల్టర్‌ బెడ్‌ ద్వారా నీటి సరఫరా నిర్వహించబడేది. ఇప్పుడు ఆ వ్యవస్థను మరింత విస్తరించి ఆధునిక సదుపాయాలతో అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. ఇప్పటివరకు ఖమ్మం నగరానికి ప్రధానంగా లకారం ట్యాంకు నుంచే నీటి సరఫరా కొనసాగుతోంది. అయితే, నగర విస్తరణతో పాటు జనాభా పెరగడంతో ప్రస్తుతం ఉన్న వనరులు పూర్తిస్థాయిలో సరిపోవడం లేదు. దీనికి పరిష్కారంగా కొత్త పైపులైన్‌ వ్యవస్థలు, ఫిల్టర్‌బెడ్‌లు, పంప్‌హౌస్‌లు నిర్మించే ప్రణాళిక సిద్ధమవుతోంది.

ఖమ్మం అభివృద్ధికి పునాది

రక్షిత మంచినీటి సమస్యకు ఈ ప్రాజెక్టు శాశ్వత పరిష్కారాన్ని అందించడమే కాకుండా, భవిష్యత్‌లో ఖమ్మం నగర అభివృద్ధికి పునాది వేయనుంది. మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణలో కూడా ఈ ప్రణాళిక కీలక పాత్ర పోషించనుంది. గతంలో మంత్రిగా ఉన్నప్పటి నుంచే ఖమ్మం నగర అభివృద్ధి పట్ల తుమ్మల నాగేశ్వరరావు చూపిన చిత్తశుద్ధి, నిరంతర కృషి ఈరోజు ఫలితాలుగా మారాయి. ప్రజల అవసరాలను గుర్తించి, వాటిని తీర్చే దిశగా ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవడం పట్ల నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తుమ్మల చూపిన చొరవ, కృషి ఫలితంగా కాంగ్రెస్ సర్కారు 200 కోట్లు కేటాయించిందని, ఖమ్మం నగర ప్రజలు ముఖ్య మంత్రికి మంత్రి తుమ్మల కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img