epaper
Monday, March 2, 2026
epaper

కౌన్ బ‌నేగా మేయ‌ర్‌

కౌన్ బ‌నేగా మేయ‌ర్‌
కొత్తగూడెం మేయర్ రేసులో ముగ్గురు
ఎస్టీ జనరల్ రిజర్వేషన్‌తో మేయర్ ఎన్నికపై ఉత్కంఠ
సీపీఐలో మూడ్ గణేష్, కళావతి, నునావత్ శ్యామల మధ్య పోటీ
సీపీఐలో అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర, జిల్లా నేతల మథనం
కాంగ్రెస్‌లో ఉపమేయర్ పదవిపై తీవ్ర పోటీ
సోమవారం ఎన్నికపై కొత్త‌గూడెం రాజ‌కీయాల్లో ఉత్కంఠ‌

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. ఎస్టీ జనరల్ రిజర్వేషన్ కింద జరుగుతున్న ఈ ఎన్నికలో సిపిఐ పార్టీ నుంచి ముగ్గురు నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మూడ్ గణేష్, కళావతి, నునావత్ శ్యామల మేయర్ రేసులో ఉండటంతో అసలు కుర్చీ ఎవరి ఖాతాలో పడుతుందన్నది హాట్ టాపిక్‌గా మారింది. కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ కీలక స్థానం దక్కించుకోవడంతో మేయర్ పదవిపై ఆ పార్టీ ఆశలు పెరిగాయి. కార్పొరేషన్ ఎన్నికలు సజావుగా ముగిసినా, మేయర్ ఎంపిక విషయంలో సిపిఐలో అంతర్గత పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. గెలుపుతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ, ఎవరిని మేయర్‌గా ఎంపిక చేయాలన్న విషయంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం తలమునకలై చర్చలు కొనసాగిస్తోంది. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన నేతలందరికీ మేయర్ పదవిపై ఆశలు ఉండటంతో నిర్ణయం కీలకంగా మారింది.

సీపీఐలో ట్రయాంగిల్ ఫైట్

కొత్తగూడెం కార్పొరేషన్‌లో తొలిసారి మేయర్ పదవి దక్కించుకునే అవకాశం రావడంతో సిపిఐలో తీవ్ర పోటీ నెలకొంది. 31వ డివిజన్ కార్పొరేటర్ నునావత్ శ్యామల పేరు ఇప్పటికే ప్రధానంగా వినిపిస్తోంది. చదువుకున్న నాయకురాలిగా, పార్టీకి నిబద్ధతతో సేవలందించిన వ్యక్తిగా ఆమెకు మంచి గుర్తింపు ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో సీతంపేట ప్రాంతానికి చెందిన మూడ్ గణేష్, కొత్తగూడెం ప్రాంతానికి చెందిన కళావతి పేర్లు కూడా మేయర్ రేసులో బలంగా వినిపిస్తున్నాయి. ముగ్గురు అభ్యర్థులూ పార్టీకి విధేయులే కావడంతో ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో సిపిఐ నాయకత్వం తీవ్ర మథనం జరుపుతోంది. ఈ ట్రయాంగిల్ ఫైట్ మేయర్ ఎన్నికను మరింత ఆసక్తికరంగా మార్చింది.

కాంగ్రెస్‌తో ఒప్పందం… అధికార భాగస్వామ్యం

కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయినా, సిపిఐతో పొత్తు కుదుర్చుకుని అధికారంలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సిపిఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఐదేళ్ల పదవీకాలంలో రెండున్నరేళ్లు సిపిఐ, మిగిలిన రెండున్నరేళ్లు కాంగ్రెస్ పార్టీకి మేయర్ పదవి దక్కేలా అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందంతో సిపిఐలో మేయర్ ఎంపికకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. మొదటి విడతలో మేయర్ పదవి సిపిఐకి దక్కనున్న నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై రాష్ట్ర కార్యవర్గం సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉపమేయర్ పదవిపై పోటీ నెలకొంది. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు ఉపమేయర్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే నూకల సరిత, దుంపల రాజేష్ పేర్లు ఉపమేయర్ రేసులో వినిపిస్తున్నాయి. పార్టీ నాయకత్వం ఎవరికీ అవకాశం కల్పిస్తుందన్నది ఆసక్తిగా మారింది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో మేయర్, ఉపమేయర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా సిపిఐలో మేయర్ అభ్యర్థి ఎంపిక, కాంగ్రెస్‌లో ఉపమేయర్ పోటీ ఉత్కంఠ రేపుతున్నాయి. సోమవారం జరిగే ఎన్నికలతో మేయర్ కుర్చీ ఎవరి ఖాతాలో పడుతుందన్నది తేలనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img