కాకతీయ, అమరావతి: విశాఖలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్న ఘటన కలకలం రేపింది. ఆరిలోవలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే అతను పెట్రోల్ పోసుకుని నిప్పటించుకోవంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమీపంలో ఉన్న కొందరు వెంటనే స్పందించారు. మంటలను ఆర్పివేశారు. తర్వాత పోలీసులకు, 108కి సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడిని 108లో కేజీహెచ్ కు తరలించారు. కుటుంబంలో గొడవల వల్లే సదరు వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది.


